Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ సమావేశంలో తొక్కిసలాట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లోని ఖరేవాన్ సరయ్మీర్లో సమాజ్వాద్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సమావేశానికి కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చారు. అయితే.. పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభివాదం అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించేందుకు లేవగానే కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగి సభా వేదిక వద్ద తొక్కిసలాట జరిగింది. ఒక్కసారిగా కార్యకర్తలు వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొద్దిసేపటి తర్వాత ప్రశాంత వాతావరణం ఏర్పడింది.
Valley of Flowers: ఈ భూలోక స్వర్గాన్ని ఎప్పుడైనా చూశారా?.. ప్లాన్ చేసుకోండి..
Also Read
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
- Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్సభలోని 543 సీట్లలో దేశంలోని 140 కోట్ల మంది బీజేపీకి 143 సీట్లు కూడా ఇవ్వరని ఆరోపించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం పదేళ్లుగా అధికారంలో ఉండి.. టీకా వేసేందుకు కూడా దోపిడీకి పాల్పడ్డారని మండిపడ్డారు. నేడు ఆ వ్యాక్సిన్ ముప్పును కలిగిస్తుందని.. టీకాలు వేసుకోవడానికి బీజేపీకి ఓటేస్తారా? అని ప్రశ్నించారు.
Kanhaiya Kumar: కాంగ్రెస్ నేత కన్హయ్య కుమార్పై సిరా విసిరిన నిందితుడు అరెస్ట్..
బాబా సాహెబ్ రాజ్యాంగం కంటే బీజేపీ నేతలు పెద్దవారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వంలో రైతులు యూరియా కొనుగోలుకు వస్తే నానో యూరియా ఇస్తున్నారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రతి పేపర్ లీక్ అయిందని యువతకు తెలుసు.. ఈ క్రమంలో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చిందని అన్నారు. యువత చాలా ప్రిపరేషన్తో వెళ్లారని.. తీరా పరీక్ష రాయడానికి వెళ్లగా పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే రేషన్ పరిమాణం పెంచుతామని అఖిలేష్ యాదవ్ అన్నారు. జూన్ 4 తర్వాత కేబినెట్ ఏర్పాటు చేస్తామని.. జూన్ 4 తర్వాత మీడియా సర్కిల్ కూడా మారిపోతుందని పేర్కొన్నారు. తమకు సంతోషకరమైన రోజులు వస్తాయని. మే 25న అజంగఢ్ చరిత్ర మారిపోతుందని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!