Akhilesh Yadav: ప్రజల ప్రాణాలతో బీజేపీ చెలగాటమాడుతుంది.. కోవిషీల్డ్ పై అఖిలేష్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయనే ఆరోపణలపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రియాక్ట్ అయ్యారు. వ్యాక్సిన్ తయారీ దారుల దగ్గర నుంచి రాజకీయ విరాళాలు సేకరించడం కోసమే బీజేపీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. ఈ అంశంపై ఇవాళ (బుధవారం) ఆయన ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేశారు. ప్రాణాంతకమైన మందులను అనుమతించడం అంటే ఎవరినైనా హత్య చేయడానికి కుట్ర చేయడమేనని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని ఎస్పీ చీఫ్ డిమాండ్ చేశారు. సుమారు 80 కోట్ల మంది భారతీయులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారన్నారు. ‘కొవిడ్ వ్యాక్సిన్ తయారీదారు నుంచి బీజేపీ పెద్ద ఎత్తున కమిషన్ తీసుకుంది అని ఆరోపణలు చేశారు. అందుకే ప్రజలకు బలవంతంగా ఈ వ్యాక్సిన్ అందించిందని పేర్కొన్నారు.. ఈ విషయంలో బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించబోరని అఖిలేష్ యాదవ్ తెలిపారు.
Also Read
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
- India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
- Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
కాగా, తాము తయారు చేసిన కొవిడ్ వ్యాక్సిన్ రక్తం గడ్డ కట్టడానికి కారణం అవుతుందని బ్రిటన్కు చెందిన ఫార్మా దిగ్గజం అస్ట్రాజెనెకా కోర్టులో తెలిపింది. దీంతో భారతదేశ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే బ్రిటన్ అభివృద్ధి చేసిన అస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను భారత్లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసి కోవిషీల్డ్ పేరుతో అమ్మకాలు చేసింది. మరోవైపు ఈ వ్యవహారంపై ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. ఇదేనా మోడీ హామీ అంటూ ఆయన ప్రశ్నించారు. మోడీ దేశ ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారని అజయ్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
-
Jai Hanuman: ‘జై హనుమాన్’లో రాముడిగా ఆ స్టార్ హీరోనేనా? ప్రశాంత్ వర్మ ప్లాన్ ఇదేనా!
-
Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
-
India-Nepal Border Dispute: భారత్తో సరిహద్దు వివాదం.. ఒప్పంద పత్రాలు పోగొట్టుకున్న నేపాల్..
-
Kangana Ranaut: హరియాలీ తీజ్ వేడుకల్లో కంగనా రనౌత్తో కలిసి డ్యాన్స్ చేసిన ముఖ్యమంత్రి
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!