Hardeep Singh Puri :పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కృషి
- చమురు ఉత్పత్తిని రోజుకు 45 000 బ్యారెళ్లకు పెంచుతాం
- ముడిచమురు ధర బ్యారెల్కు 75-80 డాలర్లకు చేరినప్పుడే పెట్రోల్.. డీజిల్ ధరల్లో తగ్గింపు
- బీపీసీఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదు
- పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ 3.0లో ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణపై దృష్టి పెట్టవచ్చని పలువురు అభిప్రాయ పడ్డారు. అయితే ఇప్పుడు ప్రభుత్వ వ్యూహం కాస్త మారినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం గత హయాంలో చమురు కంపెనీ పెట్టుబడుల ఉపసంహరణలో బిజీగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వ వైఖరి మారింది. పెట్రోలియం మంత్రిత్వ శాఖను హర్దీప్ సింగ్ పూరీ బాధ్యతలు చేపట్టిన వెంటనే.. ప్రస్తుతం బీపీసీఎల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని చెప్పారు.
READ MORE: Rainy Season : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈ నియమాలు పాటించండి
Also Read
- ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Himmat Singh: అరెరే.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
పెట్టుబడుల ఉపసంహరణ ప్రశ్నకు సమాధానమిస్తూ.. చమురు, గ్యాస్ పిఎస్యుల నుంచి ప్రభుత్వానికి 19-20 శాతం రాబడి వస్తుందన్నారు. అందువల్ల ఇప్పుడు BPCLలో పెట్టుబడుల ఉపసంహరణ ఉద్దేశం లేదని.. అన్వేషణ, ఉత్పత్తిపై మరింత దృష్టి పెట్టడానికి ప్రణాళిక ఉందన్నారు. త్వరలో చమురు ఉత్పత్తిని రోజుకు 45,000 బ్యారెళ్లకు పెంచనున్నట్లు తెలిపారు. దీనితో పాటు ముడిచమురు ధర బ్యారెల్కు 75-80 డాలర్లకు చేరినప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. గ్రీన్ఫీల్డ్ రిఫైనింగ్కు బిపిసిఎల్ అధునాతన దశలో ఉందని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. పెట్రోలు, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించడం ఇంకా కష్టమన్నారు.
కాగా.. 2024 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో BPCL రూ. 19,000 కోట్ల కంటే ఎక్కువ నికర లాభాన్ని ఆర్జించింది. BPCL FY 2023-24 నాల్గవ త్రైమాసికంలో రూ. 4,789.57 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 30% తగ్గింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.6,870.47 కోట్లుగా ఉంది.
తాజావార్తలు
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
-
Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
-
Donald Trump: ట్రంప్ గోల్ఫ్ కోర్స్ సమీపంలో లోడెడ్ గన్తో వ్యక్తి అరెస్ట్.. మరో హత్యాయత్నం కుట్రపై అనుమానాలు?
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!