NTV Telugu Site icon

Suicide: ఆ వ్యాధితో బాధ పడుతూ.. భరించలేక గన్‌తో కాల్చుకుని యువకుడు ఆత్మహత్య

Suicide

Suicide

ఉత్తర్ ప్రదేశ్లోని పాటియాలీ కొత్వాలి ప్రాంతంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు తన తండ్రి లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తుపాకీ పేలిన శబ్ధం విని కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. వెంటనే వారు యువకుడి గది వద్దకు వెళ్లి తలుపు తెరిచే సరికి.. లోపల గడియ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో.. తలుపులు పగులగొట్టి చూడగా యువకుడి మృతదేహం రక్తంతో తడిసి పడి ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

Read Also: Train Incident: కదులుతున్న రైలుపై రాళ్లు రువ్విన వ్యక్తి.. దెబ్బకి ప్రయాణికుడి ముక్కు.?

వివరాల్లోకి వెళ్తే.. కస్బా భర్గైన్‌లోని మొహల్లా హసన్ థోక్‌లో నివసిస్తున్న షంసుల్ హసన్ కుమారుడు 18 ఏళ్ల మహ్మద్ హుస్సేన్ ఖాన్ ఆదివారం రాత్రి తన గదిలో నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తన గదిలో నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంతో కుటుంబ సభ్యులు నిద్ర లేచారు. కుటుంబ సభ్యులు వెంటనే అతని గది వైపు పరిగెత్తి తలుపు తెరవడానికి ప్రయత్నించారు. కానీ అది లోపల నుండి లాక్ చేయబడింది.

Read Also: Anand Mahindra : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్‌పర్సన్‌గా ఆనంద్ మహీంద్రా

కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్ తిన్నారు. మహ్మద్ హుస్సేన్ మృతదేహం రక్తంతో తడిసి పడి ఉంది. తండ్రి లైసెన్స్ తుపాకీ అతని దగ్గర కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తుపాకీని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే.. మహ్మద్ హుస్సేన్.. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలోనే మానసిక ఒత్తిడికి లోనై ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చెప్పారు.