NTV Telugu Site icon

Hyderabad Crime: హైదరాబాద్ లో దారుణం.. అత్తాపూర్‌లో పాత కక్షలతో ఓ వ్యక్తి హత్య

Hyd Murder

Hyd Murder

హైదరాబాద్ లోని అత్తాపూర్ లో ఇవాళ (ఆదివారం) తెల్లవారుజామున ఖలీల్ అనే వ్యక్తిని దారుణంగా చంపేశారు. పాతకక్షల నేపథ్యంలోనే ఖలీల్ ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లోని పహాడీ షరీఫ్ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ కు ఖలీల్ మధ్య గత కొంత కాలంగా గొడవలున్నాయి. ఈ గొడవల కారణంగానే ఖలీల్ ను ఉస్మాన్ చంపేశాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖలీల్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా దవాఖానాకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: Ileana D’cruz Pregnancy: ఇలియానా ప్రెగ్నెన్సీకి కారణం ఇతడే.. ఫోటో పెట్టిందోచ్

అయితే.. అత్తాపూర్ లో అర్ధరాత్రి దుండగులు రెచ్చిపోయి.. చింతల్ మెట్ వద్ద ఖలీల్ ఉల్లా అనే యువకుడి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వివరించారు. కత్తులతో పొడిచి అతి దారుణం గా చంపేసినట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలు.. హత్యకు గల‌ కారణాలపై ఆరా తీస్తున్నారు.

Read Also: CM KCR: గోదావరి పరివాహక ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ

ఖలీల్ ఉల్లా కేసులో అత్తాపూర్ పోలీసులు పురోగతి సాధించారు. హంతకుడు పహాడీ షరీఫ్ కు చెందిన రౌడీ షీటర్ ఉస్మాన్ గా గుర్తించారు. చెప్పుల వ్యాపారం చేసే ఖలీల్ ఉల్లాకు ఉస్మాన్ కు మధ్య గత కొన్ని రోజులగా విభేదాలు ఉన్నట్లు గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలో ఖలీల్ ను ఉస్మాన్ హత్య చేసి నట్లు పోలీసులు ప్రాథమిక సమాచారం అందించారు. ఖలీల్ ఉల్లా ఇక్కడికి ఎందుకు వచ్చాడు..? ఎవరి గురించి వచ్చాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు అత్తాపూర్ పోలీసులు వెల్లడించారు.