Terrorist: ఆ రాష్ట్రాలపై నజర్ పెట్టిన ఉగ్రవాదులు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్ లో ఉగ్రవాదులు పలు రాష్ట్రాలపై నజర్ పెట్టినట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్–భోపాల్లలో అరెస్టు చేసిన ఉగ్రవాదులకు సంబంధించిన కేసు విచారణను మధ్యప్రదేశ్ లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులు, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ముమ్మరం చేసింది. ఈ కేసును ఢిల్లీ యూనిట్ గత నెల 24న రీ–రిజిస్టర్ చేసింది. దీని దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక ఎన్ఐఏ బృందం నిన్న (సోమవారం) ఢిల్లీ నుంచి భోపాల్ కు చేరుకుంది.
Also Read: Durga stotra: ఈ స్తోత్రాలు వింటే అనంతమైన పుణ్యం లభిస్తుంది
Also Read
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
- Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
- Cockroach Janta Party: 2 కోట్ల ఫాలోవర్లు, 2 వేల మంది కూడా రాలే.."కాక్రోచ్ జనతా పార్టీ" ఫ్లాప్ షో..
యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) అధికారులతో సమావేశమైన ఈ టీమ్.. కేసులో అనేక విషయాలను ఆరా తీస్తుంది. గత నెల 9న.. ఏటీఎస్ అధికారులు హైదరాబాద్లో ఐదుగురు, భోపాల్లో 11 మందిని అరెస్టు చేశారు. హిజ్బ్ ఉత్ తెహ్రీర్ (HUT) ఉగ్ర సంస్థకు చెందిన ఈ మాడ్యుల్ షరియత్ స్థాపనే లక్ష్యంగా విధ్వంసాలకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Odisha Train Accident: రైలు ప్రమాదంపై ప్రారంభమైన సీబీఐ దర్యాప్తు.. ఇంకా గుర్తించని 101 మృతదేహాలు
హిజ్బ్ ఉత్ తెహ్రీర్ టార్గెట్లో అనేక ప్రాంతాలతో పాటు మత నాయకులు కూడా ఉన్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఆరోపిస్తున్నారు. కాగా, ఈ ఉగ్రవాదులు తెలంగాణ, మధ్యప్రదేశ్తో పాటు ఏయే రాష్ట్రాలను టార్గెట్గా చేసుకున్నారనే కోణంలో ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు పేలుడు పదార్థాలనూ ఏటీఎస్.. ఎన్ఐఏ అధికారులు సమీకరిస్తున్నారు. అసలు కుట్ర ఏమిటి అన్నదానిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
Also Read: Sanjay Raut: మోడీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే బాలాసోర్ రైలు దుర్ఘటన
ఈ 16 మంది ఉగ్రవాదులను అధికారులు ఇప్పటికే రెండుసార్లు తమ కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. ఎన్ఐఏ అధికారులు సైతం హైదరాబాద్, భోపాల్లకు చెందిన మహ్మద్ సలీం, యాసిర్ ఖాన్లతో పాటు మిగిలిన వారినీ మరోసారి కస్టడీలోకి తీసుకోవాలని చూస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా త్వరలో వీరిని హైదరాబాద్ తీసుకురావాలని ఎన్ఐఏ అధికారులు నిర్ణయించింది.
తాజావార్తలు
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
-
Pawan Kalyan : పవన్ ఫోకస్తో పెదపెంకికి కొత్త జీవం
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!