Gandhi Jayanthi 2024: భారత కరెన్సీపై మహాత్మా గాంధీ ఫోటో పెట్టడం వెనుక కారణం ఏంటో తెలుసా?
- భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ నవ్వుతున్న చిత్రం
- నోటుపై ముద్రించిన బాపు చిత్రం 1946లో క్లిక్ చేసిన ఫోటో
- గాంధీ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gandhi Jayanthi 2024: ఈ రోజు దేశం మొత్తం మహాత్మ గాంధీ జయంతిని జరుపుకుంటోంది. మన భారతీయ కరెన్సీ పై గాంధీ ఫొటోస్ ఉండటం చూస్తున్నాం.. కానీ ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధులు ఉండగా, ఆయన ఫోటోలను పెట్టడానికి అసలు కారణాలు చాలామందికి తెలియదు.. దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.. ఆ స్టోరీ ఏంటో ఈరోజు గాంధీ జయంతి సందర్బంగా వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచంలోని వివిధ దేశాల నోట్లపై ఆయా దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తుల చిత్రాలు ముద్రించబడతాయి. అమెరికాలోని ప్రతి నోట్పై వేర్వేరు అధ్యక్షులు, ఇతర వ్యక్తుల చిత్రాలు ఉంటాయి. బ్రిటన్లో రాజు చిత్రం ఉంటుంది. అదే సమయంలో.. భారతదేశంలో ప్రతి కరెన్సీ నోటుపై జాతిపిత మహాత్మా గాంధీ చిత్రం ఉంటుంది. అయితే మహాత్మా గాంధీ కంటే ముందు భారతదేశం కరెన్సీ నోట్ల పై అశోక చక్రం ఉండేది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు ఆర్బీఐ తర్వాత గాంధీ బొమ్మను ముద్రించారు. నోటుపై ముద్రించిన మహాత్మా గాంధీ చిత్రం 1946లో తీసిన ఫోటో నుంచి కత్తిరించబడిందట. ఆ ఫోటోలో గాంధీబ్రిటిష్ రాజకీయవేత్త లార్డ్ ఫ్రెడరిక్ విలియం పెథిక్-లారెన్స్తో కలిసి ఉన్నారట. ఈ ఛాయాచిత్రం గాంధీజీ యొక్క చిరునవ్వు వ్యక్తీకరణకు తగిన విధంగా ప్రాతినిధ్యం వహిస్తున్నందున ఎంపిక చేయబడింది. అయితే ఫోటోగ్రాఫర్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. మహాత్మా గాంధీ చిత్రాన్ని ఎవరు క్లిక్ చేశారనేది ప్రశ్నగానే మిగిలింది.
Also Read
- Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
- Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
1969లో ఆయన 100వ జయంతిని పురస్కరించుకుని భారత కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ చిత్రం తొలిసారిగా కనిపించింది. 1969లో మొదటిసారిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన నోటును విడుదల చేసింది. ఇందులో సేవాగ్రామ్ ఆశ్రమం ముందు గాంధీజీ కూర్చొని ఉన్న ఫోటోని నోట్ల పై ముద్రించారు.. మన కరెన్సీ నోటుపై 1987లో మొట్టమొదటిగా నవ్వుతున్న జాతిపిత చిత్రం ముద్రించబడింది. అదే ఏడాదిలో అక్టోబర్లో రూ.500 నోటును ముద్రించారు. అందులో గాంధీ చిరునవ్వుతో కూడిన చిత్రం కనిపించింది. దీని తరువాత అప్పటి నుంచి ఇప్పటివరకు అదే నోట్లను ముద్రిస్తున్నారు.. ఇంకో విషయం ఏంటంటే.. నోటుపై గాంధీ గారికన్నా ముందు బ్రిటన్ రాజు జార్జ్ VI చిత్రం ఉంది. స్వాతంత్య్రానంతరం బ్రిటీష్ రాజు బొమ్మ స్థానంలో గాంధీ బొమ్మని ముద్రించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ అది జరగడానికి చాలా సమయం పట్టింది.. అలా ఇప్పుడు గాంధీ బొమ్మను నోట్ల పై ముద్రిస్తున్నారు.. ఒక లెజెండ్ పర్సన్ అనే చెప్పాలి.. స్వాతంత్య్రం రావడానికి మూల కారణం గాంధీజీ.. ఈరోజు ఆయన జయంతి సందర్బంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుందాం.
నకిలీ నోట్ల భయంతో కొత్త ఫీచర్లు
తదనంతరం, 1996లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహాత్మా గాంధీ చిత్రంతో కూడిన కొత్త సిరీస్ నోట్లను విడుదల చేసింది. నిజానికి 1990ల నాటికి, నకిలీ నోట్ల తయారీ సాంకేతికత చాలా అభివృద్ధి చెందినట్లు RBI గమనించింది. డిజిటల్ ప్రింటింగ్, స్కానింగ్, ఫోటోగ్రఫీ, జిరోగ్రఫీ వంటి సాంకేతికతలు నకిలీ నోట్ల తయారీని సులభతరం చేశాయి. మానవ ముఖాల కంటే నిర్జీవ వస్తువులను కాపీ చేయడం సులభమని ఆర్బీఐ విశ్వసించింది. అందుకే కొత్త నోట్లపై మహాత్మాగాంధీ చిత్రాన్ని ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. గాంధీజీ జాతీయ ఆకర్షణ కారణంగా ఎంపికయ్యారు. కొత్త నోట్లకు అనేక కొత్త భద్రతా ఫీచర్లు కూడా జోడించబడ్డాయి. వీటిలో విండోస్ సెక్యూరిటీ థ్రెడ్, అజ్ఞాత చిత్రం, దృష్టి లోపం ఉన్నవారి కోసం ఇంటాగ్లియో ఫీచర్లు ఉన్నాయి. ఆ తర్వాత 2016లో ఆర్బీఐ మరోసారి కొత్త నోట్లను విడుదల చేసింది. ఈ నోట్లను ‘మహాత్మాగాంధీ న్యూ సిరీస్’ అని పిలిచారు. ఈ నోట్లపై కూడా గాంధీజీ చిత్రం ఉంది.
తాజావార్తలు
-
Congress vs BRS: తెలంగాణ భవన్ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్ రావును అడ్డుకున్న పోలీసులు!
-
Ather 450X Overtones: ఏథర్ కొత్త 450X ఓవర్టోన్స్ సిరీస్.. 900W ఫాస్ట్ ఛార్జర్, వాయిస్ కమాండ్తో మరింత స్మార్ట్!
-
Shruti Haasan : ఐడెంటిటీ కోల్పోతున్న శృతి హాసన్
-
Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!
-
Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?