Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ‘సిరా’ చరిత్ర తెలుసా..!
Indelible Election Ink: ఎన్నికల్లో చెరగని ముద్ర ఒకటి ఉంటుంది.. అదే సిరా గుర్తు. ఎప్పుడైనా ఆలోచించారా సిరా మరకల వెనక ఉన్న కథ గురించి. బీహార్ ఎన్నికల నేపథ్యంలో ఈ సిరా ముద్ర సందడి మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఇందులో హైలెట్ ఏంటంటే భారతదేశం నుంచి ఈ సిరాను ముప్పై ఐదు దేశాలు కొనుగోలు చేస్తున్నాయి. ఇంతకీ ఈ సిరా కథ ఏంటి, ఎన్నికలకు దీనికి మధ్య సంబంధం ఏంటి, ఎప్పటి నుంచి ఈ సిరాను ఎన్నికల్లో వాడుతున్నారు, దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఈ సిరా మూలాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు అనేక ఓటు చోరీ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని ఎన్నికల కమిషన్కు చేరుకున్నాయి. దీనికి పరిష్కారం కోసం వాళ్లు వివిధ ఆలోచనలను ముందుకు తెచ్చారు. చివరగా ఎన్నికల కమిషన్ ఓటరు వేలుపై సులభంగా చెరిపివేయలేని ఒక గుర్తును సృష్టించాలని నిర్ణయం తీసుకుంది. చాలా చర్చల తర్వాత, కమిషన్ ఒక పరిష్కారాన్ని కనుగొనడానికి నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియాను సంప్రదించింది.
పరిష్కారం ఎలా వచ్చిందంటే..
దీని పరిష్కారం కోసం ఎన్నికల కమిషన్ నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (NPL)ని సంప్రదించింది. అప్పుడు NPL నీరు లేదా రసాయనాల ద్వారా తుడిచివేయలేని ఒక సిరాను అభివృద్ధి చేసింది. ఈ సిరాను మైసూర్ పెయింట్ వార్నిష్ కంపెనీకి ఉత్పత్తి చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. ఆ కంపెనీ ఓటింగ్ రుజువుగా మారిన ఈ సిరాను అభివృద్ధి చేసింది. నాటి నుంచి కర్ణాటకలోని మైసూర్లోని ఇదే కంపెనీ ఎన్నికల సిరాను ఉత్పత్తి చేస్తోంది. మైసూర్లో దీనిని రహస్య సూత్రాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు.
1971 ముందు వరకు వేలికి చెరగని సిరా వేసేవారు, కానీ ఈలోగా ప్రజలు దానిని ఉపయోగించడానికి నిరాకరించినట్లు అనేక నివేదికలు వెలువడ్డాయి. వారణాసికి చెందిన ఒక యువతి తన పెళ్లి రోజున తన వేలిపై ఉన్న గుర్తు ఆకర్షణీయంగా లేనందున దానిని వేసుకోడానికి నిరాకరించింది. ఇలాంటి సంఘటనల తరువాత ఎన్నికల కమిషన్ 1971లో నియమాలను సవరించింది. ఈ సిరాను వేలుగోళ్లకు బదులుగా గోళ్లకు వర్తించే పద్ధతిని ప్రవేశపెట్టింది. 1952లో నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (NPL) ద్వారా సృష్టించిన ఈ సిరా, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తల కృషి ఫలితం అని అధికారులు వెల్లడించారు. దీని ఉత్పత్తిలో సిల్వర్ నైట్రేట్ ఉపయోగిస్తారు. సిరాలోని సిల్వర్ నైట్రేట్ శరీరంలోని సోడియంతో కలిసి సోడియం క్లోరైడ్ను ఏర్పరుస్తుంది, దీని వలన నీలిరంగు సిరా నల్లగా మారుతుంది అని సైన్స్ చెబుతుంది. నీటితో తాకినప్పుడు ఇది చిక్కగా మారుతుందని, సబ్బు కూడా దీనిని తొలగించడానికి పనికిరాదు.
వాస్తవానికి దీని పూర్తి ఫార్ములా నేటికీ రహస్యంగానే ఉంది. నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా లేదా మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిషెస్ లిమిటెడ్ దీనిని బహిరంగంగా ఇప్పటి వరకు ప్రకటించలేదు. ముఖ్యంగా మైసూర్కు చెందిన కంపెనీ తప్ప మరే ఇతర కంపెనీకి ఈ సిరాను తయారు చేసే హక్కు లేదు. ఇదే మైసూర్కు చెందిన కంపెనీ దశాబ్దాలుగా ఈ చెరగని సిరాను ఉత్పత్తి చేస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 35 కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇది చెరగని సిరా స్టోరీ..
READ ALSO: Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్లో 22 వికెట్లు తీసిన డీఎస్పీ.. ఆమె ఎవరో తెలుసా?
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!