తాజా రాజకీయ పరిణామాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపిస్తోంది. రెండ్రోజుల నుంచి సూచీల్లో ఒడుదుడుకులు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్లాట్గా ప్రారంభమైన సూచీలు.. అదే ఒరవడిని కొనసాగించాయి. అస్థిరత మధ్య ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 33 పాయింట్ల స్పల్ప నష్టాలతో 76, 456 దగ్గర ముగియగా.. నిఫ్టీ స్వల్ప లాభంతో 23, 264 దగ్గర ముగిసింది.
ఇది కూడా చదవండి: Governor Radhakrishna: నాకు అబ్రహం లింకన్, ప్రధాని మోడీ ఇన్స్పిరేషన్..
నిఫ్టీలో ONGC, L&T, అదానీ పోర్ట్స్, మారుతీ సుజుకి మరియు హీరో మోటోకార్ప్ టాప్ గెయినర్స్గా ఉండగా… కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ITC నష్టపోయాయి. DLF, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ మరియు గోద్రెజ్ ప్రాపర్టీస్ కారణంగా నిఫ్టీ రియల్టీ 1 శాతం పెరిగింది.
ఇది కూడా చదవండి: Janasena Chief: కక్ష సాధింపునకు ఇది సమయం కాదు.. అలాంటివి నేను ఎంకరేజ్ చేయను..!