Odisha Train Accident: ముగిసిన రెస్య్కూ ఆపరేషన్.. ట్రాక్ పునరుద్ధరణ పనులు స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రైలు ప్రమాద స్థలంలో బాధితులను కాపాడేందుకు శుక్రవారం రాత్రి ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ నిన్న (శనివారం) మధ్యాహ్నం ముగిసిందని రైల్వే అధికారులు తెలిపారు. దీంతో ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 18 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద స్థలం నుంచి బాధితులను తరలించేందుకు 200 అంబులెన్స్ లు, 50 బస్సులు, 45 మొబైల్ హెల్త్ యూనిట్లను ఉపయోగించినట్లు ఒడిశా అధికారులు చెప్పారు. సుమారు 1200 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు. మృతదేహాలను తరలించేందుకు అన్ని వాహనాలను వాడుకున్నామని అధికారులు పేర్కొన్నారు.
Also Read: SP Balu: పాటగా బ్రతకవా మా అందరి నోటా…
Also Read
- Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
- Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
- Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
- Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
రైలు ప్రమాద స్థలంలో 300 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ అతుల్ కర్వాల్ తెలిపారు. మెటల్ కట్టర్స్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్స్, హెవీ లిఫ్ట్ ఎక్విప్ మెంట్లతో వారంతా బాధితుల కోసం వెతికారని ఆయన అన్నారు. లోకల్ పోలీసులు, రైల్వే సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 9 బృందాలుగా సహాయక చర్యల్లో పాల్గొన్నారని, వీరిలో మహిళా సిబ్బంది, మెడికల్ టీమ్స్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ల సభ్యులు 44 మందిని ప్రాణాలతో కాపాడారని, 71 మంది మృతదేహాలను వెలికితీశారన్నారు. ప్రధానంగా ధ్వంసమైన రైలు బోగీలను కట్ చేస్తూ, వాటిలో బతికి ఉన్న వారిని కాపాడటమే తమ సిబ్బందికి ఇచ్చిన మెయిన్ టాస్క్ అన్నారు.
Also Read: Uttarapradesh : 8 ఏళ్ల బాలికపై 80 వృద్ధుడు లైంగికదాడి..దారుణం..
రైలు ప్రమాదం జరిగిన వెంటనే ఆ పరిసరాల్లో ఉన్న స్థానికులు పరుగుపరుగున వచ్చి చాలా మందిని కాపాడారు. బోగీల్లో నెత్తురోడుతున్న వారిని బయటకు తీసి సమీపంలోని దవాఖానలకు తరలించారు. పోలీసులకు, రైల్వే సిబ్బందికి కొందరు సమాచారం ఇవ్వగా.. మరికొందరు బాధితులను బయటకు తీశారు. గాయపడిన వాళ్లను ఇంకొందరు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారు సహాయం అందించారు.
తాజావార్తలు
-
Vijayawada: భక్తులకు సువర్ణావకాశం.. ఇంద్రకీలాద్రిపై రేపటి నుంచి ఉచిత యోగా శిక్షణ
-
Prashant Kishor: రూ.10 వేలతో ఓట్లు కొని గెలిచారు.. నితీష్కుమార్పై మరోసారి ప్రశాంత్ కిషోర్ విమర్శలు
-
Rama Nandana: యూట్యూబర్స్ ‘గలీజ్ దందా’ స్కామ్.. రంగంలోకి దిగిన తెలంగాణ పోలీస్..
-
Sourav Ganguly: మమతకు మద్దతుగా యూసుఫ్ పఠాన్ను గంగూలీ రాజీనామా చేయమన్నారా..? ఇదిగో క్లారిటీ..
-
IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!