TDP-BJP-Janasena: టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉమ్మడి ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో చంద్రబాబు, అమిత్ షా, పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. మళ్లీ ఎన్డీయేలో చేరడం సంతోషంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, దేశానికి సేవ చేయడం కోసమే టీడీపీ – బీజేపీ- జనసేన మధ్య పొత్తు కుదిరిందని తెలిపారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి మూడు పార్టీలు కట్టుబడి ఉన్నాయని అన్నారు. మోడీ, అమీత్ షా, నడ్డా, పవన్ కళ్యాణ్ కలిసి ఏపీలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికే సమయం కోసం ఎదురుచూస్తున్నా.. రాష్ట్రాభివృద్ధి, ప్రజా శ్రేయస్సు కోసం కూటమి స్వర్ణయుగం తెస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, తెలుగు ప్రజల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఏపీ ప్రజలు తమకు సేవ చేసేందుకు చారిత్రాత్మకమైన ఈ కూటమిని ఆశీర్వదించాలని చంద్రబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.

Also Read
- Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
- Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
- Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
- Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
Arun Goel: లోక్సభ ఎన్నికల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా..
మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి ఏపీ ప్రజల ఆకాంక్షలను వేగంగా నెరవేర్చుతుందని తెలిపారు. మోడీ నాయకత్వంపై తమకున్న నమ్మకాన్ని చాటుతూ టీడీపీ, జనసేన పార్టీలు ఎన్డీయేలో చేరాయన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాలను ఎన్డీఏలోకి స్వాగతిస్తున్నా.. నరేంద్ర మోడీ దార్శనికత నాయకత్వంలో ఎన్డీఏ బలమైన రాజకీయ వేదికగా ఏర్పడుతోందని ట్వీట్ లో తెలిపారు.

బీజేపీ-టీడీపీ-జనసేనలది చారిత్రాత్మక కూటమి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తెలిపారు. ఏపీ ప్రజలకు ఆశ, స్థిరత్వం శ్రేయస్సు అందించడమే కూటమి లక్ష్యం అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బాధ్యతాయుతమైన భాగస్వాములుగా పని చేస్తాం.. ఏపీని అన్ని విధాలుగా శక్తివంతమైన రాష్ట్రంగా మార్చడానికి మా వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎన్డీఏ సహజ భాగస్వామి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ, రాష్ట్ర శ్రేయస్సు కోసం మా ఎన్డీఏ కూటమిని మరింత స్థిరీకరించడానికి ఎదురు చూస్తున్నట్లు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తెలిపారు.
The fundamental purpose of this historic alliance of BJP-TDP-JSP is to give hope, stability and prosperity to people of AP.
Under dynamic, daring, & visionary leadership of Hon. PM Shri @narendramodi ji , We all will be working as responsible stakeholders who will put our best… pic.twitter.com/Jw6kE54klh— Pawan Kalyan (@PawanKalyan) March 9, 2024
తాజావార్తలు
-
Delhi High Court: ఊపిరాడక చనిపోవాల్సి వస్తుంది.. ‘దేవుడే కాపాడాలి’.. ఢిల్లీ పరిస్థితిపై హైకోర్టు తీవ్ర ఆందోళన
-
Petrol-Diesel: పెట్రోల్లో ఇథనాలు, డీజిల్లో ఐసోబ్యుటానాల్.. కేంద్రం మరో నిర్ణయం.!
-
Iran-Israel Ceasefire: ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్.. మళ్లీ దాడులు చేస్తే మాత్రం..!
-
Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం.. పలువురు కార్మికుల సజీవ దహనం
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!