Insta Reels: పని పక్కన పడేసి రీల్స్ చేస్తోందన్న కోపంతో భార్యను చంపిన భర్త..
- మరో ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి
- పని పక్కన పడేసి రీల్స్ చేస్తుందన్న కోపంతో భార్యను హత్య చేసిన భర్త
- మృతదేహాన్ని మూటగట్టి బాత్రూంలో పడేసిన భర్త
- ఉప్పల్ లో మూడు రోజుల క్రితం ఘటన.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటింది. దాన్ని ఎంత మంచికి ఉపయోగిస్తే అంత మంచిది. కాదని చెడుకు వినియోగిస్తే.. అది ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా కారణంగా అతి సామాన్యులు, పేదలు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వురులైన తమ పేదరికాన్ని జయించిన సంఘటనలు ఎన్నో చూశాం. అయితే అదే సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు తీసుకున్న వారిని చూశాం. ప్రాణాలు తీసిన వారిని చూస్తున్నాం. తాజాగా.. హైదరాబాద్ లో రీల్స్ పిచ్చి ఓ మహిళ ప్రాణాలు పోయేలా చేసింది.
Tea : టీ తాగితే తలనొప్పి తగ్గుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..
Also Read
- Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
వివరాల్లోకి వెళ్తే.. రీల్స్ పిచ్చి మరో ప్రాణం తీసింది. పని పక్కన పడేసి రీల్స్ చేస్తుందన్న కోపంతో భార్యను చంపేశాడు భర్త. అనంతరం మృతదేహాన్ని మూటగట్టి బాత్రూంలో పడేసి మూడేళ్ల బాలుడిని తీసుకుని పారిపోయాడు. ఈ ఘటన ఉప్పల్ లో మూడు రోజుల క్రితం జరిగింది. కాగా.. తాజాగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రీల్స్ చేస్తూ తనను పట్టించుకోవడం లేదని.. భార్యతో భర్త తరుచూ గొడవ పడేవాడు. అంతేకాకుండా.. రీల్స్ ముసుగులో వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని భర్త అనుమానం పెంచుకున్నాడు. రీల్స్ మానేయమని చాలాసార్లు చెప్పిన వినకపోవడంతో.. దీంతో భార్య మదుస్మితను భర్త ప్రదీప్ హత్య చేశాడు.
Karnataka: కూతురి ప్రైవేట్ వీడియోలు వైరల్ చేసిన తండ్రి.. ఆత్మహత్యాయత్నం..
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ లో జరిగిన ఈ మర్డర్ కేసును ఉప్పల్ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఉప్పల్, న్యూ భరత్ నగర్ లో ఐదు నెలలుగా ఓ హోటల్లో పనిచేస్తున్న మధు స్మిత, ప్రదీప్ బోలా దంపతులు అద్దె ఇంట్లో ఉంటున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు, ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం, రీల్స్ చేయడం, ఫోన్ తో గంటలు తరబడి ఉండడంతో భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. అర్ధరాత్రి చపాతి పీటతో తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయిన మధుస్మిత.. తర్వాత చున్నితో ఆమె మెడకు బిగించి హత్య చేశాడు భర్త ప్రదీప్. మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి పరారయ్యాడు. కాగా.. బేగంపేట ఏరియాలో ప్రదీప్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించారు.
- Tags
- husband
- hyderabad
- Insta Reels
- kill
- uppal
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!