RTC Bus: పరిహారం చెల్లించకపోవడంతో ఆర్టీసీ బస్ సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RTC Bus: తమిళనాడు రాష్ట్రంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. కోయంబత్తూరులో ప్రమాదానికి కారణమై పూర్తి పరిహారం చెల్లించకపోవడంతో రెండోసారి ప్రభుత్వ బస్సును సీజ్ చేశారు. కోయంబత్తూరు పొల్లాచ్చి జమీన్ ఉత్తుకుళికి చెందిన మహాలింగం. ఇతని కుమారుడు సతీష్ (24). బీఏ పట్టభద్రుడైన అతడు కోయంబత్తూరులోని శరవణంపట్టి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో 2018లో ఉక్కడం సిగ్నల్ దగ్గర బైక్ పై వెళుతుండగా సతీష్ వెనుకే వస్తున్న ప్రభుత్వ బస్సు ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో, సతీష్ కుటుంబం నష్టపరిహారం కోరుతూ కోయంబత్తూరు జిల్లా అదనపు కోర్టులో కేసు వేసింది. 2019లో కేసును విచారించిన న్యాయమూర్తి సతీష్ కుటుంబానికి రూ.12 లక్షల ప్రమాద పరిహారం చెల్లించాలని ఆదేశించారు.
Read Also: Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
కానీ తమిళనాడు ప్రభుత్వ రవాణా సంస్థ ప్రమాదానికి తగిన పరిహారం ఇవ్వకపోవడంతో వడ్డీతో కలిపి 16 లక్షలు చెల్లించాలని మళ్లీ కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి బాధితురాలి కుటుంబానికి రూ.16 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. పరిహారం చెల్లించకపోవడంతో గత జనవరిలో కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ బస్సును సీజ్ చేశారు. ఈ కేసులో రాష్ట్ర రవాణా సంస్థ అధికారులు 7.40 లక్షల పరిహారం చెల్లించారు. మిగిలిన మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లిస్తామని రవాణా సంస్థ అధికారులు తెలిపారు. అయితే నెల రోజులు గడుస్తున్నా సొమ్ము చెల్లించకపోవడంతో మళ్లీ రెండోసారి అదే ప్రభుత్వ బస్సును సీజ్ చేయడం గమనార్హం.
Read Also: Drugs Price : ఫార్మా కంపెనీల ‘మందు’పాతర.. ఏప్రిల్ 1న విడుదల
తాజావార్తలు
-
Shakib Al Hasan: బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటిపై.. పెట్రోల్ బాంబు దాడి!
-
Dhanush-Kareena Kapoor: భన్సాలీ కొత్త ప్రాజెక్ట్లో ధనుష్ కి జోడీగా కరీనా? పౌరాణిక అడ్వెంచర్కు రంగం సిద్ధం!
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!