Andhra Pradesh: ఏపీ రైతులకు శుభవార్త.. ఇవాళే నిధులు విడుదల
- రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..
- గత రబీ సీజన్లో ధాన్యం విక్రయించి.. బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులు..
- పాత బకాయిలను అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం..
Andhra Pradesh: రైతులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. గత రబీ సీజన్లో ధాన్యం విక్రయించి.. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం ఎదురుచూస్తున్న రైతులకు తీపికబురు చెప్పింది కూటమి ప్రభుత్వం.. పాత బకాయిలను అందించడానికి ఇవాళ్టి నుంచి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖమంత్రి నాదెండ్ల మనోహర్.. ఈ రోజు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో ఈ రోజు పర్యటించనున్నారు.. ఇక, తన పర్యటనలో భాగంగా.. కలెక్టరేట్లో జరిగే ఒక కార్యక్రమంలో రైతులకు ధాన్యం బకాయిలకు సంబంధించిన చెక్కులను అందజేయనున్నారు. మొత్తంగా ఏపీలో ఇవాళ ధాన్యం రైతులకు 674 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఉదయం ఏలూరు, సాయంత్రం అమలాపురంలో రైతులకు చెక్కులు పంపిణీ చేస్తారు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్..
Read Also: Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!
Also Read
- SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
- US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ 'మాస్టర్ ప్లాన్' సిద్ధం!
- Petrol, Diesel Price: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. పెట్రోల్, డీజిల్ పెరుగుదలపై కేంద్రం క్లారిటీ!
- Bitter Gourd Chips Recipe: కారం కారంగా కరకరలాడే కాకరకాయ చిప్స్.. చేదు లేకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసే ప్రత్యేక రెసిపీ..
గత ప్రభుత్వంలో రబీ ధాన్యం విక్రయించిన రైతులకు 1,674 కోట్ల రూపాయల బకాయిలు పెట్టింది.. అయితే, రెండు విడతలుగా ధాన్యం బకాయిలు విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. ధాన్యం డబ్బులు చెల్లించాలంటూ కోనసీమ కలెక్టరేట్ వద్ద పలు సార్లు రైతులు ఆందోళనకు దిగిన సందర్భాలు ఉన్నాయి.. కోనసీమ జిల్లాలో రబీ పంటకు సంబంధించి 19,652 మంది రైతుల నుంచి ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులు కొనుగోలు చేశారు. వారికి రూ.355.88 కోట్లను అందించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 10,823 మంది రైతులకు సంబంధించి రూ.201.25 కోట్లను రైతులకు పంపిణీ చేశారు. ఇక మిగిలిన 8,829 మంది రైతులకుగాను రూ.192 కోట్లను ఈ రోజు అమలాపురంలోని కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ బకాయిలను అందించనున్నారు..
Read Also:Siddhnath Temple: ఆలయంలో భారీ తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి!
కాగా, గత ప్రభుత్వంలో రైతులు చితికిపోయారని.. అన్నదాతల నుంచి సేకరించిన ఆహారధాన్యాలకు సకాలంలో బిల్లులు చెల్లించలేదంటూ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణలు గుప్పించారు.. రైతుల బకాయిలు చెల్లించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు 1000 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. ఐదేళ్ల గత ప్రభుత్వంలో రైతులు అన్ని విధాలా చితికిపోయారని మనోహర్ ఆరోపించారు. రైతుల వద్ద కొన్న ఆహారధాన్యాలకు చెల్లించాల్సిన మొత్తం పూర్తిగా బకాయిలు పెట్టి రైతు ధైర్యం కోల్పోయేలా చేశారని మండిపడిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Shubman Gill: ఈ రోజు నా రోజు.. ఐయామ్ ఫుల్ హ్యాపీ!
-
SBI Credit Card New Rules: మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్ ఉందా..? ఇవాళ్టి నుంచి కీలక మార్పులు
-
Junior Civil Judge Court: కాటారం రెవెన్యూ డివిజన్కు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంజూరు..
-
Kalki2898AD : ‘కల్కి 2’ షూటింగ్ స్టార్ట్.. రెబలోడు సెట్స్ లో ఎప్పుడు అడుగుపెడుతున్నాడంటే?
-
US: ముంచుకొస్తున్న ముప్పు.. ఇరాన్ను తుడిచిపెట్టేందుకు ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’ సిద్ధం!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!