Nayantara : నయనతారకు షాక్ ఇచ్చిన కోర్టు.. అసలేం జరిగిందంటే !
- నయనతార కోర్టు షాక్
- ధనుష్ తో వివాదం నడుమ మొట్టికాయలేసిన కోర్టు
- కుబేర సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రనటులందరితో నటించి ఇండస్ట్రీలో తనకంటే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇటీవల తన డాక్యుమెంటరీలో నాన్ రౌడీ ధాన్(తెలుగులో నేను రౌడీనే) వీడియో క్లిప్ ఆ సినిమా నిర్మాత ధనుష్ అనుమతి లేకుండా వాడుకున్నారని ఆయన నయన్ మీద 10 కోట్ల జరిమానా వేశాడు. ఈ విషయం మీదే ధనుష్ ని టార్గెట్ చేస్తూ నయనతార సోషల్ మీడియాలో ఓపెన్ లెటర్ రాసింది. ఓపెన్ లెటర్ తో మ్యాటర్ మరింత సీరియస్ అయింది. ఐతే నయన్, ధనుష్ కేసు విచారణ రాగా నయనతారకు కోర్టు ఝలక్ ఇచ్చింది. ధనుష్ నిర్మించిన నాన్ రౌడీ ధాన్ క్లిప్స్ ను అతని పర్మిషన్ తో వేసుకోవాలి నిర్మాత పర్మిషన్ లేనిది ఎలా వేసుకుంటారని ప్రశ్నించింది. అంతేకాదు ఈ ఇష్యూపై ఆమె నుంచి క్లారిటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. జనవరి 8 లోగా నయనతార సమాధానం చెప్పాలని కోర్టు సూచించింది. ఇంతకీ కోర్టుకు నయనతార క్లారిటీ ఇస్తుందా లేదా అన్నది చూడాలి. ధనుష్ తన సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమా కాబట్టి అతను డిమాండ్ చేయడంలో తప్పులేదని కోర్టు అభిప్రాయపడింది. అలా కాకుండా అతని అనుమతి లేకుండా ఆ క్లిప్స్ వాడటం చట్టరీత్యా నేరమే అవుతుందని పేర్కొంది.
Read Also:Airtel One Year Plan: ఏడాదిపాటు చెల్లుబాటుతో అతి తక్కువ ధరకు ప్లాన్ తీసుకొచ్చిన ఎయిర్టెల్
Also Read
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ధనుష్ తో కలిసి ఇదివరకు స్క్రీన్ షేర్ చేసుకున్న నయనతార ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంది. వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తుంది. ఐతే ఈ ఇష్యూపై కోలీవుడ్ సినీ ప్రముఖులు మాత్రం ఇదంతా ఎందుకొచ్చిన గొడవ అన్నట్లుగా సైలెంట్ గా ఉన్నారు. మరి నయన్ వర్సెస్ ధనుష్ వివాదంలో గెలుపు ఎవరిని వరిస్తుంది. వారిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే మార్చం ఎవరు చేస్తరన్నది చూడాలి. సినిమాల విషయానికి వస్తే నయనతార తన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ధనుష్ ప్రస్తుతం కుబేర, ఇడ్లీ కొడై సినిమాలను చేస్తున్నాడు. ఇడ్లీ కొడై సినిమాను ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ధనుష్ డైరెక్ట్ చేసిన రాయన్ ఇటీవల వచ్చి సక్సెస్ అందుకుంది. అందుకే మళ్లీ నటిస్తూ డైరెక్షన్ చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ధనుష్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. అందుకే ఇక్కడ కూడా ఆయనకు భారీ అభిమానులు ఏర్పడ్డారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వస్తున్న కుబేర సినిమాలో మన్మథుడు నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మరోసారి అవార్డింగ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది. ఐతే కమర్షియల్ గా కూడా కుబేర నెక్స్ట్ లెవల్లో ఉంటుందని సమాచారం.
Read Also:CM Chandrababu on Tourism: టూరిజంపై ఫోకస్.. మాటలు కాదు.. 3 నెలల్లో అమలు కనిపించాలి
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!