Unwanted Calls: స్పామ్ కాల్స్ కి చెక్ పెట్టనున్న కేంద్ర ప్రభుత్వం..!
- అవాంఛిత కాల్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం ముసాయిదా నిబంధనలు విడుదల
- కాల్స్ అనుమతించాలంటే వినియోగదారుడి అనుమతి తప్పనిసరి
- ఎలాంటి అనుమతి లేకుండా కాల్స్.. సందేశాలు వస్తే కంపెనీపై చర్యలు
- వీటిపై జూలై 21 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరనున్న ట్రై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన ఫోన్లో కాంటాక్ట్స్లో లేని నంబర్ నుంచి కాల్ వస్తే.. ఎత్తాలా వద్దా అని వంద సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. కారణం.. ఫోన్ లిఫ్ట్ చేయగానే.. క్రెడిట్ కార్డు కావాలా? లోన్లు కావాలా? ఫ్లాట్ కావాలా? అంటూ ఇలా పదే పదే ఇబ్బందులు పెడుతుంటారు. వద్దనుకుంటుంటే అలాంటి కాల్స్ ఎక్కువగా వస్తుంటాయి. చాలా మందిని ఈ సమస్య వేధిస్తుంటుంది. రోజులో పదుల సంఖ్యలో ఇలాంటి కాల్స్ వస్తాయి. మనం అప్పుడు ఏదైనా పనిలో ఉన్నప్పుడు.. ఇలాంటి కాల్స్ వస్తే.. కోపం, చిరాకు వస్తాయి. ఇలాంటి కాల్స్ను నియంత్రించే దిశగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట పడట్లేదు. అందుకే ఇప్పుడు స్వయంగా కేంద్రం రంగంలోకి దిగింది. వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇలాంటి అవాంఛిత కాల్స్పై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం గురువారం ముసాయిదా నిబంధనలను విడుదల చేసింది.
READ MORE: NET-NEET Paper Leak : నెట్-నీట్లో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్న కాంగ్రెస్
Also Read
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
- Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ముసాయిదా ప్రకారం.. ఎవరైనా వ్యాపార ప్రమోషన్ లేదా ఏదైనా అమ్మకానికి సంబంధించిన కాల్లను స్వీకరించడానికి వినియోగదారుడు పర్మిషన్ తప్పనిసరి చేసింది. వినియోగదారుని అనుమతి లేకుండా అతను అలాంటి కాల్లు మరియు సందేశాలను స్వీకరిస్తే అది అవాంఛిత వ్యాపారంగా పరిగణించబడుతుంది. కాలింగ్ ఎంటిటీ లేదా వ్యక్తి దీనికి బాధ్యత వహించాలి. నమోదుకాని టెలిమార్కెటర్ల నుంచి లేదా 10-అంకెల ప్రైవేట్ నంబర్ల నుంచి అవాంఛిత కాల్లను నిరోధించడం ప్రతిపాదిత మార్గదర్శకాల ఉద్దేశం. వస్తువులు, సేవలకు సంబంధించిన ఏదైనా ప్రచార కాల్ లేదా సేవా సందేశం వ్యాపార కమ్యూనికేషన్గా కిందికి వస్తుందని డ్రాఫ్ట్ పేర్కొంది. వ్యక్తి గత కమ్యూనికేషన్ దానికి దూరంగా ఉంచనుంది. ఆ కాల్స్ పై వినియోగదారుడి అంగీకారం తప్పనిసరి చేయనుంది. TRAI సూచనల తర్వాత కూడా అవాంఛిత కాల్ల సమస్యను దృష్టిలో ఉంచుకుని, మంత్రిత్వ శాఖ, టెలికాం కంపెనీలతో సహా సంబంధిత అన్ని పార్టీలతో చర్చించింది. అనంతరం ఈ ముసాయిదా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. వీటిపై జూలై 21 వరకు ప్రజల నుంచి అభిప్రాయాలను కోరనుంది.
తాజావార్తలు
-
Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?