NTV Telugu Site icon

Parliament: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రవేశ పెట్టిన కేంద్రం..లోక్‌సభలో తీవ్ర గందరగోళం

Parliament

Parliament

ఈ రోజు పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు వక్ఫ్ చట్టం 1995ని సవరించడానికి వక్ఫ్ (సవరణ) బిల్లు 2024ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్, ఎస్పీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇది మన మతంలో జోక్యం చేసుకోవడమేనని ఎస్పీ ఎంపీ మొహిబుల్లా అన్నారు. దీంతో పార్లమెంట్ లో తీవ్ర గందరగోళం నెలకొంది.

READ MORE: Andhra Pradesh: పల్నాడు జిల్లాలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజు కిడ్నాప్!

వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు – లాలన్ సింగ్
పార్లమెంట్‌లో వక్ఫ్ బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లాలన్ సింగ్ విపక్షాలపై ధీమా వ్యక్తం చేశారు. “ఏదైనా సంస్థ నిరంకుశంగా మారినప్పుడు.. దానిని నియంత్రించడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత ఉండాలి. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చాం.” అని స్పష్టం చేశారు.

READ MORE:Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్

ఇది రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన – కనిమొళి
ఇది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి అన్నారు. “ఏ ఆలయ కమిటీలో హిందువేతర సభ్యుడు లేనప్పుడు వక్ఫ్‌లో ఎందుకు? ఈ బిల్లు ప్రత్యేకంగా సమానత్వం యొక్క చట్టాన్ని ఉల్లంఘించే మత సమూహాన్ని లక్ష్యంగా చేసుకుంది. ఈ బిల్లు పూర్తిగా ముస్లింలకు వ్యతిరేకం. ఈ దేశం వివిధ మతాలు, వివిధ భాషల ప్రజలు నివసించే లౌకిక దేశం.” అని పేర్కొన్నారు.

READ MORE:Naga Chaitanya Engagement: ఇట్స్ అఫీషియల్.. శోభితతో నాగచైతన్య ఎంగేజ్‌మెంట్! నాగార్జున ట్వీట్ వైరల్

వక్ఫ్ బిల్లు ప్రాథమిక హక్కులపై దాడి – వేణుగోపాల్
వక్ఫ్‌ బిల్లుపై కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. రాజ్యాంగం ప్రసాదించిన మత స్వేచ్ఛ హక్కును ఉల్లంఘించడమేనని అన్నారు. “ఈ బిల్లు ప్రాథమిక హక్కులపై దాడి. అయోధ్యలోని ఆలయంలో హిందువేతరు ఎవరైనా ఉన్నారా? ఏ దేవాలయం కమిటీలో హిందువేతరునైనా ఉంచారా? అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ కూడా మతపరమైన సంస్థేనని వేణుగోపాల్ అన్నారు. ఇది సమాజాన్ని విభజించే ప్రయత్నంలో భాగంగా జరుగుతోందని మండిపడ్డారు.

READ MORE:Pune : పుణెలో ఘోర ప్రమాదం.. ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలో గ్యాస్ లీక్

రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా..
రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత సభా కార్యక్రమాలను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు.