Kolkata Doctor Murder: ‘రేపు బంద్ లేదు.. అందరూ ఆఫీసుకు రావాల్సిందే’.. ప్రభుత్వం అల్టిమేటం
- కోల్ కతా ట్రైనీ డాక్టర్ పై ఘటనలో అట్టుడుకుతున్న కోల్ కతా
- పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విద్యార్థులు
- రాష్ట్ర సచివాలయాన్ని ముట్టడించిన విద్యార్థులు
- మద్దతు తెలిపిన బీజేపీ
- రేపు బెంగాల్ బంద్ కు బీజేపీ పిలుపు
- రాష్ట్ర ప్రభుత్వం ఎన్ కౌంటర్
- ఎలాంటి బంద్ లేదని ఆఫీసుకు రావాల్సిందే అని అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్ట్ 28న బిజెపి పిలుపునిచ్చిన 12 గంటల సమ్మెలో పాల్గొనవద్దని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మంగళవారం ప్రజలను కోరింది. సమ్మె కారణంగా సాధారణ జనజీవనం దెబ్బతినకుండా పరిపాలన చూస్తుందని వెల్లడించింది. రాష్ట్ర సచివాలయం ‘నబ్బన’ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న నిరసనకారులపై పోలీసుల చర్యకు వ్యతిరేకంగా.. రేపు (ఆగస్టు 28) ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ బెంగాల్ బంద్కు పిలుపునిచ్చిందన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మమతా ప్రభుత్వం
READ MORE; Vijay Party: హీరో విజయ్ కి బిఎస్పి షాక్
Also Read
- OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
- LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
- Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
- New Smart Mobile: OLED డిస్ప్లే, 1TB స్టోరేజ్, 7,000mAh బ్యాటరీ.. పాస్పోర్ట్ లాంటి ఫోన్.. ఎగబడుతున్న జనాలు..
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్య సలహాదారు అలపన్ బందోపాధ్యాయ మాట్లాడుతూ.. ‘బుధవారం బంద్ను ప్రభుత్వం అనుమతించదు. ఇందులో పాల్గొనవద్దని ప్రజలను కోరుతున్నాం. సాధారణ జనజీవనం ప్రభావితం కాకుండా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటాం.” అని పేర్కొన్నారు. దీని తరువాత, రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులందరూ బెంగాల్ బంద్లో పాల్గొనవద్దని విజ్ఞప్తి చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు మహిళా ట్రైనీ డాక్టర్కు న్యాయం చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫోరమ్ ఆగస్టు 28న కోల్కతాలో పెద్ద ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
READ MORE;Be Alert On Seasonal Diseases: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. ఆరోగ్యంతో చెలగాటమాడితే సస్పెండ్
కాగా.. కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం.. హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ కోల్ కతా మాంత్రం అట్టుడికి పోతుంది. విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. పోలీసులు వారిపై లాఠీఛార్జి చేస్తున్నారు. ఘటనా స్థలానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రతినిధులు బయలు దేరారు. బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత్ మజుందార్, పార్టీ ప్రతినిధి బృందాన్ని కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్కు తరలించారు. సుకాంత్ మజుందార్ నేతృత్వంలో కోల్కతా పోలీస్ హెడ్క్వార్టర్స్ వెలుపల బీజేపీ కార్యకర్తలు సమ్మెలో కూర్చున్నారు. నేటి ఘటనకు నిరసనగా రేపు 12 గంటలకు బెంగాల్ బంద్కు పిలుపునిస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ కొనసాగుతుంది.” అని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?