Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఖమ్మం జిల్లాలో సైబర్ మోసాలకు సహకరిస్తున్న ఆర్థిక నెట్వర్క్పై విరుచుకుపడింది. సెప్టెంబర్ 2, 3 తేదీల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులతో కలసి నిర్వహించిన ఈ ఆపరేషన్లో 11 బృందాలు, 40 మంది అధికారులు పాల్గొని బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలు, అనుమానిత ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
గతంలో నమోదైన సైబర్ కేసుల దర్యాప్తులో అక్రమ డబ్బును తరలించేందుకు సైబర్ నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలు అందించడం, విదేశీ ఆపరేటర్లతో కలసి టెలిగ్రామ్ ద్వారా అనధికార గేమింగ్ చెల్లింపులు నడపడం వెలుగులోకి వచ్చింది. ఇటీవల బాదిస మురళీకృష్ణ, వడ్లమూడి సాయినివాస్లను అరెస్ట్ చేసి, వారు అందించిన 10 మ్యూల్ ఖాతాలను గుర్తించారు. గతంలో 49/2026 కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా, మొత్తంమీద రెండు కేసులకు సంబంధించి ఇప్పటివరకు 52 మంది నిందితులను అరెస్ట్ చేశారు.
Also Read
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
- Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
- Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
దీనిలో మొత్తం 30 బ్యాంకు శాఖల్లోని 121 మ్యూల్ ఖాతాలు, అధిక ఏటీఎం ఉపసంహరణలు జరిగిన 273 ఖాతాలు, చెక్ విత్డ్రాయల్స్ ఉన్న 12 ఖాతాలతో పాటు 25 అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. ఈ ఖాతాలకు దేశవ్యాప్తంగా సైబర్ కేసులతో సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీటి ద్వారా రూ. 7.84 కోట్ల లావాదేవీలు జరగ్గా, అందులో రూ. 6.23 కోట్లు వివాదాస్పదమైనవిగా నిర్ధారించారు.
ప్రస్తుతం 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. గత ఫిబ్రవరి 2026లోని ‘ఆపరేషన్ కాక్డౌన్ 1.0’లో కూడా 75 మ్యూల్ ఖాతాలను గుర్తించి 25 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో వ్యాపారులు, కూలీలు, నిరుద్యోగులతో పాటు మాజీ సీఎస్బీ బ్యాంక్ ఉద్యోగులు కూడా ఉన్నారు. కేవలం కమీషన్ ఆశ చూపి ఎవరైనా అడిగితే బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, పిన్, ఓటీపీ వంటి వివరాలు ఇతరులకు ఇవ్వరాదని టీజీసీఎస్బీ స్పష్టం చేసింది. సైబర్ నేరాలకు దుర్వినియోగమయ్యే ఖాతాదారులు చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
-
Father-Daughter Bond: తండ్రి ప్రేమకు నెటిజన్లు ఫిదా.. Miss You మెసేజ్.. కూతురి కోసం 14 గంటల ప్రయాణం..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!