Asaduddin Owaisi: మణిపూర్ మండిపోతుంటే, జవాన్లు చనిపోతుంటే.. కర్ణాటకలో ప్రచారమా?.. మోదీపై ఒవైసీ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో రోడ్షో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఓ వైపు మణిపూర్లో హింస చెలరేగి తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్లో సైనికులు చనిపోతుంటే ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారని, రోడ్ షోలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ‘పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మన సైనికులను హతమారుస్తుండగా.. మణిపూర్లో హింస చెలరేగుతుండగా, ప్రధాని నరేంద్ర మోదీ ‘ది కేరళ స్టోరీ’ అనే ‘ఫిక్షన్’ సినిమా గురించి మాట్లాడటం బాధాకరం’’ అని ఒవైసీ అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమా ‘ది కేరళ స్టోరీ’ని నరేంద్ర మోదీ ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.
అసదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశలో కొనసాగుతోంది. భజరంగ్ దళ్, బజరంగ బలి, ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ వంటి అంశాలు వార్తల్లో ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణాది రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అనేక అంశాలపై ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్లో ఒకవైపు ఉగ్రవాదులు సైనికులను హతమారుస్తున్నారని, మణిపూర్ హింసాకాండలో మండిపోతోందని, మన దేశ ప్రధాని కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారని ఒవైసీ అన్నారు. కర్నాటకలో ఎన్నికలు జరుగుతున్నాయని, అయితే పాకిస్థాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చి మన ఐదుగురు సైనికులను హతమార్చారని, మణిపూర్లో మంటలు చెలరేగుతుంటే ప్రధాని ఎన్నికల కోసం ప్రచారం ఏంటని ప్రశ్నించారు. ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోతున్నారు, కానీ అక్కడి ఎన్నికల్లో ప్రధాని ఆ డర్టీ పిక్చర్ (ది కేరళ స్టోరీ)ని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ఏఐఎంఐఎం చీఫ్ ఇంకా మాట్లాడుతూ.. “ఇది తప్పుడు చిత్రం. ప్రధాని విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో గెలుపొందడం కోసమే ప్రధాని ఇంత దిగజారారు. ప్రధానమంత్రి జాతీయవాదంపై ఎన్నికల ప్రసంగాలు మాత్రమే చేస్తారని, అయితే మన సైనికులు చనిపోయినప్పుడు మౌనంగా ఉంటారు.” అని అసదుద్దీన్ ఒవైసీ వ్యంగ్యంగా అన్నారు.
Read Also: Khalistan Commando Chief: ఖలిస్తాన్ కమాండో చీఫ్ పరమ్జిత్ పంజ్వార్ హత్య!
ఒవైసీ ఈ మాటల దాడి ఎందుకు చేస్తున్నారు?
వాస్తవానికి, కర్ణాటకలోని బళ్లారిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ‘కేరళ స్టోరీ’ సినిమాపై మాట్లాడుతూ, “ఉగ్రవాద కుట్రపై తీసిన సినిమా కేరళ కథ… ఇది ఒకే రాష్ట్రంలోని ఉగ్రవాద కుట్రలపై ఉందని చెప్పారు. కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులు ఉన్న కేరళ లాంటి రాష్ట్రంలో జరుగుతున్న ఉగ్రవాద కుట్రలను ఈ చిత్రం బట్టబయలు చేస్తుంది” అన్నారు. ఈ నేపథ్యం ఆ సినిమా గురించి ప్రధాని వ్యాఖ్యలపై ఒవైసీ స్పందించారు. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 8న ఎన్నికల ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలోని 224 స్థానాలకు మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
Sad that while Pakistan-backed terrorists are killing our soldiers, ugly violence has engulfed Manipur PM #NarendraModi is talking about a ‘fiction’ movie called #TheKeralaStory – #AIMIM chief @asadowaisi on #KarnatakaAssemblyElection pic.twitter.com/wz6rqlaXy1
— Ashish (@KP_Aashish) May 6, 2023
Ek Election jeetne ke liye PM @narendramodi ko Jhoot aur Propaganda par mabni Movie 'The Kerala Story' ka Sahara lena pad raha haipic.twitter.com/ikSfGpgxIx
— Asaduddin Owaisi (@asadowaisi) May 6, 2023
తాజావార్తలు
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
-
Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!