Haryana: “జిహాదీల చావుకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం”.. హర్యానలోఉగ్రవాదుల దాడి బెదిరింపు లేఖ
- పంజాబ్లోని స్వర్ణ దేవాలయం.. వైష్ణో దేవి ఆలయం.. అమర్నాథ్ యాత్రలను లక్ష్యంగా చేసుకున్నట్లు గుర్తింపు
- జమ్మూ కాశ్మీర్లోని పలు రైల్వే స్టేషన్లకు కూడా బెదిరింపులు
- దాడులకు సంబంధించిన తేదీలను కూడా లేఖలో పేర్కొన్న ముష్కరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకశ్మీర్లో ఇటీవల జరిగిన మూడు ఉగ్రదాడి ఘటనల తర్వాత ఉగ్రవాదులు మరోసారి దేశంలో అనేక దాడులకు పాల్పడతారని బెదిరించారు. హర్యాన రాష్ట్రం అంబాలా రైల్వే స్టేషన్లో ఉగ్రవాదుల దాడి బెదిరింపు లేఖ దొరికింది. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం, వైష్ణో దేవి ఆలయం, అమర్నాథ్ యాత్రలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు లేఖలో రాశారు. జమ్మూ కాశ్మీర్లోని పలు రైల్వే స్టేషన్లు కూడా ఉగ్రవాదుల టార్గెట్గా ఉన్నాయి.
READ MORE: POCSO Case: సీఐడీ విచారణకు హాజరుకానున్న యడ్యూరప్ప..
Also Read
లేఖలో..“ఓ దేవా, దయచేసి నన్ను క్షమించు. జమ్మూ కాశ్మీర్లో మా జిహాదీల మరణానికి మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము. జమ్మూలోని కథువా, పఠాన్కోట్ బియాస్ మరియు భటిండా రైల్వే స్టేషన్లపై సరిగ్గా జూన్ 21న బాంబులు వేస్తాం. జూన్ 23న కత్రా వైష్ణో దేవి, అమర్నాథ్ ఆలయం, శ్రీనగర్లోని లాల్ చౌక్, అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, హిమాచల్లోని అనేక దేవాలయాలపై బాంబు దాడి జరగనుంది. ఈసారి జమ్మూ-కశ్మీర్, పంజాబ్లను రక్తంతో చిత్రిస్తాం. అప్పుడే దేవుడు నన్ను క్షమిస్తాడు.” అని రాసి ఉంది. ఈ లేఖలో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా పేరు రాసి ఉంది. ఈ లేఖను లష్కరే తోయిబా ఏరియా కమాండర్ కుల నూర్ అహ్మద్ రాశారు. లేఖ దొరికిన తర్వాత భద్రతా సంస్థలు ఈ లేఖను పరిశీలిస్తున్నాయి. నిన్న రైల్వే పోలీసులకు అంబాలా రైల్వే స్టేషన్లో పరిధిలో ఈ బెదిరింపు లేఖ దొరికింది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!