Telugu Devotees Attacked in Sabarimala: తెలుగు భక్తులపై దాడి.. శబరిమలలో ఉద్రిక్తత..
- శబరిమలలో తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి..! ఓ అయ్యప్ప తల పగలగొట్టి వ్యాపారి...
- వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగి నందుకు..
- గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టిన షాపు యజమాని..
Telugu Devotees Attacked in Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది.. తెలుగు రాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు మరియు స్థానిక దుకాణదారుల మధ్య జరిగిన వాగ్వాదం పెద్దదిగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం ప్రకారం, ఒక దుకాణంలో నీటి బాటిల్ ధరపై భక్తులు ప్రశ్నించగా, ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా భక్తులలో ఒకరు గాయపడినట్లు తెలిసింది. సంఘటన వివరాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఇతర తెలుగు భక్తులు కూడా ఆ దుకాణం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, చుట్టుపక్కల ఉన్న కొంతమంది దుకాణదారులు కూడా అక్కడికి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను, వ్యాపారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.. అయితే, కొందరు భక్తులు పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఉంది. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Read Also: Road Accident: ఏపీలో మరో ప్రమాదం.. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి..
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
కాగా, ప్రతీ ఏడాది శబరిమలకు పెద్ద సంఖ్యలో తెలుగు భక్తులు వెళ్తూనే ఉంటారు.. అయ్యప్పమాల ధరించి.. మండల పూజలు చేసి.. శబరిమల వెళ్తారు.. అయితే, కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు, ఇవాళ దాడికి గురైన అయ్యప్ప భక్తులు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ప్రాంతానికి చెందినవారు.. మొత్తం 10 మంది అయ్యప్ప భక్తులు తిరుపతి నుంచి శబరిమల వెళ్లగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, వారికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు అంతా మద్దతుగా నిలిచారు..
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?