Telugu Devotees Attacked in Sabarimala: తెలుగు భక్తులపై దాడి.. శబరిమలలో ఉద్రిక్తత..
- శబరిమలలో తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి..! ఓ అయ్యప్ప తల పగలగొట్టి వ్యాపారి...
- వాటర్ బాటిల్ ధర ఎక్కువ ఉందని అడిగి నందుకు..
- గాజు సీసాతో భక్తుడి తల పగలగొట్టిన షాపు యజమాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Devotees Attacked in Sabarimala: శబరిమలలో ఉద్రిక్తత నెలకొంది.. తెలుగు రాష్ట్రాల నుంచి దర్శనానికి వెళ్లిన కొందరు అయ్యప్ప భక్తులు మరియు స్థానిక దుకాణదారుల మధ్య జరిగిన వాగ్వాదం పెద్దదిగా మారడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం ప్రకారం, ఒక దుకాణంలో నీటి బాటిల్ ధరపై భక్తులు ప్రశ్నించగా, ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. ఈ సందర్భంగా భక్తులలో ఒకరు గాయపడినట్లు తెలిసింది. సంఘటన వివరాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఇతర తెలుగు భక్తులు కూడా ఆ దుకాణం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. మరోవైపు, చుట్టుపక్కల ఉన్న కొంతమంది దుకాణదారులు కూడా అక్కడికి రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని భక్తులను, వ్యాపారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు.. అయితే, కొందరు భక్తులు పోలీసుల చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. పరిస్థితి ప్రస్తుతం పోలీసుల పర్యవేక్షణలో ఉంది. ఘర్షణకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.
Read Also: Road Accident: ఏపీలో మరో ప్రమాదం.. ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి..
Also Read
- Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
- Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
- Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
- Beerakaya Chutney Recipe: పప్పు, అన్నంతో అదిరే రుచి.. కారం కారంగా బీరకాయ చట్నీ ఇలా చేస్తే వేళ్లు కూడా వదలరు..!
కాగా, ప్రతీ ఏడాది శబరిమలకు పెద్ద సంఖ్యలో తెలుగు భక్తులు వెళ్తూనే ఉంటారు.. అయ్యప్పమాల ధరించి.. మండల పూజలు చేసి.. శబరిమల వెళ్తారు.. అయితే, కొన్ని సార్లు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. మరోవైపు, ఇవాళ దాడికి గురైన అయ్యప్ప భక్తులు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి ప్రాంతానికి చెందినవారు.. మొత్తం 10 మంది అయ్యప్ప భక్తులు తిరుపతి నుంచి శబరిమల వెళ్లగా.. ఈ ఘటన చోటు చేసుకుంది.. అయితే, వారికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అయ్యప్ప భక్తులు అంతా మద్దతుగా నిలిచారు..
తాజావార్తలు
-
Sai Sudharsan: ఐపీఎల్ చరిత్రలోనే మొదటి బ్యాట్స్మెన్గా.. ఆ రికార్డు బద్దలు కొట్టిన సాయి సుదర్శన్..
-
WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
-
Trump: ట్రంప్ సంచలన నిర్ణయం.. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే ఛాన్స్?
-
Virat Kohli: నాకు చాలా భయమేస్తోంది.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
Guntur Job Fraud: ఉద్యోగాల పేరుతో విద్యార్థులకు భారీ మోసం.. కోట్లు నొక్కేశాడు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..