Tenali Double Horse: “రూరల్ టు గ్లోబల్” లక్ష్యంతో ‘మిల్లెట్ మార్వెల్స్’ను లాంచ్ చేసిన తెనాలి డబుల్ హార్స్
- "మిల్లెట్ మార్వెల్స్" ను లాంచ్ చేసిన తెనాలి డబుల్ హార్స్
- "రూరల్ టు గ్లోబల్" లక్ష్యంతో "మిల్లెట్ మార్వెల్స్" లాంచ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tenali Double Horse: భారతదేశంలో ప్రముఖ బ్రాండ్ తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తన ఆరోగ్యభరితమైన కొత్త ఉత్పత్తి శ్రేణి “మిల్లెట్ మార్వెల్స్” ను హైదరాబాద్లో గ్రాండ్గా లాంచ్ చేసింది. ఈ కార్యక్రమాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ JMD డా. సంగీత రెడ్డి ప్రారంభించారు. సూపర్ ఫుడ్స్ సెగ్మెంట్లోకి తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తీసుకున్న కొత్త అడుగు “మిల్లెట్ మార్వెల్స్”. ఆరోగ్యాన్ని ప్రాధాన్యంగా తీసుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులతో ఈ కొత్త “మిల్లెట్ మార్వెల్స్” ను ప్రవేశపెట్టారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
మిల్లెట్ మార్వెల్స్ మొదటిగా 18 రకాల ఉత్పత్తులను గ్రైన్స్, నూడుల్స్, కుకీస్, రెడీ-టు-కుక్ విభాగాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక్కో యూనిట్ ధర రూ. 95 నుండి ప్రారంభమవుతుంది. త్వరలోనే ఈ బ్రాండ్ పలు కొత్త శ్రేణుల్లోకి విస్తరించనుంది. ఇందులో ఆరోగ్యకరమైన మిలెట్స్, డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్స్, సజ్జి, పాస్తా, ఆరోగ్య పిండి పదార్థాలు, ఆర్గానిక్ ఉత్పత్తులు, ఫ్రీజ్ డైట్ పండ్లు, కూరగాయలు వంటి విభాగాలు ఉండనున్నాయి. మొదటి దశలో ఈ ఉత్పత్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పాన్ ఇండియా, అమెరికా, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ శ్యామ్ ప్రసాద్ మునగాల మాట్లాడుతూ.. “రూరల్ టు గ్లోబల్” అన్న ధ్యేయాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మిల్లెట్ మార్వెల్స్ ముఖ్యమైన మైలురాయి అవుతుందని తెలిపారు. ఈ కొత్త విభాగం ద్వారా మొదటి మూడు సంవత్సరాల్లో గ్రూప్ రెవెన్యూలో 5% వాటా సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2005 లో మినపగుండ్లుగా ఒక్క ఉత్పత్తితో ప్రారంభమైన తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ ఇప్పుడు 12 దేశాలు, 15 రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకున్న సంస్థగా ఎదిగింది. ప్రస్తుతం ఈ సంస్థ పల్సెస్ అండ్ దాల్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్ల ఉత్పత్తులలోకి రానుంది. ప్రస్తుతం ఈ కంపెనీ రూ. 535 కోట్లు మించిన వార్షిక ఆదాయంతో ఫార్చ్యూన్ 500 కంపెనీలలో ఉండగా, సంస్థ రాబోయే మూడు సంవత్సరాల్లోనే నాలుగు అంకెల ఆదాయ లక్ష్యాన్ని చేరుకోవాలని చూస్తోంది.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!