Alleti Maheshwar Reddy : కొత్త ఫించన్లు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి
- రూ.వందల కోట్ల విలువైన భూములను పరిశ్రమలకు కట్టబెట్టారు
- కోట్ల విలువైన భూముల్ని రూ.25 లక్షల చొప్పున ఎలా కట్టబెడతారు
- ఈ వ్యవహారాన్ని సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లా
- పెన్షన్ రూ.4 వేలకు పెంచి ఎప్పుడు ఇస్తారో చెప్పాలి : బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alleti Maheshwar Reddy : తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసన సభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా భూముల కేటాయింపు, పింఛన్లు, పంచాయతీ కార్యదర్శుల పరిస్థితి, హైడ్రా విధానం, మూసీ ప్రక్షాళన వంటి అంశాలపై ప్రభుత్వ తీరును ఆయన తప్పుబట్టారు.
ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “వందల కోట్ల ముడుపులు తీసుకుని 25 లక్షల చొప్పున భూములను పరిశ్రమలకు అప్పనంగా కట్టబెట్టారు. దేవాలయ భూములను కూడా పరిశ్రమలకు కేటాయించడం ఎంతవరకు సమంజసం?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని, అయితే గత ప్రభుత్వ తరహాలోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందా అన్నది చూడాల్సి ఉందని అన్నారు.
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
- IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
- New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
“కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం ప్రకటించాలి. మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు పింఛన్ను రూ. 4,000కి ఎప్పటి నుంచి పెంచుతారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలి,” అని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అని గుర్తుచేశారు.
Drunken Drive : ట్యాంక్ ఫుల్గా తాగి.. ట్రాఫిక్ పోలీసులకు ట్యాంకర్ డ్రైవర్…
గ్రామ పంచాయతీ కార్యదర్శుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, “పంచాయతీ కార్యదర్శులు ప్రతి నెలా 20,000 నుండి 30,000 రూపాయలు జేబులోంచి ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం కనీస సౌకర్యాలను కూడా అందించకుండా వారిపై భారమోపుతోంది. దీనివల్ల వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు,” అని చెప్పారు.
హైడ్రా విధానం ప్రజలను ఇబ్బంది పెడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా హైడ్రాపై తీవ్ర విమర్శలు చేశారని గుర్తుచేశారు. “హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. హైకోర్టు ఇప్పటికే పలుసార్లు హైడ్రాకు మొట్టికాయలు వేసింది. పేద, మధ్య తరగతి ప్రజలే హైడ్రా లక్ష్యమా?” అని ప్రశ్నించారు.
మూసీ ప్రాజెక్టును ముందుకు తెచ్చే ముందు ప్రభుత్వానికి ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. “మేనిఫెస్టోలో లేని మూసీ ప్రాజెక్టును ప్రభుత్వం ఎందుకు అమలు చేయాలని నిర్ణయించింది? అప్పులు కడుతున్నామని చెబుతున్న ప్రభుత్వం మూసీ ప్రక్షాళన ఎలా చేస్తోంది?” అని నిలదీశారు.
Physical Harassment : ఎంఎంటీఎస్ రైల్లో దారుణం.. యువతిపై అత్యాచారయత్నం!
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!