ఎంతగానో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ సంగ్రామానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఐపీఎల్ 17 సీజన్ రేపటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. కాగా.. రేపు జరిగే తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. అసలు విషయానికొస్తే.. చెన్నై జట్టులో తెలుగు కుర్రాళ్లు ఆడుతున్నారు. ఏపీకి చెందిన షేక్ రషీద్, తెలంగాణకు చెందిన అవనీశ్ రావును చెన్నై సూపర్ కింగ్స్ సొంతం…