Telangana Sadabainama: మంత్రి ప్రకటన.. వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు…
- ఖమ్మం జిల్లాలో వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు..
- ముందుకు సాగని సర్వేలు..
- పెండింగ్లో 45 వేలకు పైగా దరఖాస్తులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సాదాబైనామా (తెల్ల కాగితాలపై భూ క్రయవిక్రయాలు) క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన కీలక ప్రకటనతో కొత్త ఊపిరి పోసుకున్నట్లయింది. గతంలో ఉన్న కఠిన నిబంధనల వల్ల నిలిచిపోయిన సర్వే ప్రక్రియ, ఇప్పుడు మంత్రి ఇచ్చిన వెసులుబాటుతో వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా సాదాబైనామా క్రమబద్ధీకరణలో ‘అమ్మిన వారి’ నుంచి ధ్రువీకరణ పత్రం లేదా అఫిడవిట్ తీసుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. చాలా సందర్భాల్లో భూమి అమ్మిన వారు మరణించడం లేదా అందుబాటులో లేకపోవడంతో కొన్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటీవల దీనిపై స్పందించిన మంత్రి పొంగులేటి.. ‘అమ్మిన వారి ధ్రువీకరణ అవసరం లేదు, కొన్నవారు ఇచ్చే అఫిడవిట్ సరిపోతుంది’ అని స్పష్టం చేయడంతో వేలాది మంది దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురించాయి.
Also Read:Gold Robbery: బంగారం కోసం చెవులను కోసేసి.. ఆపై దారుణం..
Also Read
- CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
- Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
- Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
- Supreme Court: రెబల్ ఎంపీలపై పోరాటం.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్న టీఎంసీ
ఖమ్మం రెవెన్యూ డివిజన్ పరిధిలోని 15 మండలాల్లో సాదాబైనామా దరఖాస్తుల గణాంకాలు పరిశీలిస్తే.. మొత్తం 67,312 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో అర్హత పొందినవి 67,297. వీటిలొ ఆన్ లైన్ అయిన దరఖాస్తులు 15,229 ఉండగా.. 45,417 ఆర్డీఓ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. 6,398 తహశీల్దార్ల వద్ద ఉండగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల 18,440 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. ఇప్పటివరకు జరిగిన ప్రక్రియలో కేవలం రెండే రెండు దరఖాస్తులు మాత్రమే పూర్తిస్థాయి సర్వే అనంతరం ఆమోదం పొందడం గమనార్హం.
Also Read:IPL 2026 Second Phase: ఐపీఎల్ సెకండ్ ఫేజ్ షెడ్యూల్ విడుదల.. ఆ లిస్ట్ ఇదే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం గతంలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సర్వేలు ముందుకు సాగలేదు. ముఖ్యంగా అఫిడవిట్ల విషయంలో ఉన్న పేచీ వల్ల రెవెన్యూ యంత్రాంగం దరఖాస్తులను పక్కన పెట్టింది. ఇప్పుడు మంత్రి ప్రకటనతో పెండింగ్లో ఉన్న 45 వేలకు పైగా దరఖాస్తులపై ఆర్డీవో కార్యాలయం పునఃసమీక్ష చేసే అవకాశం ఉంది. సాదాబైనామాల ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందితే.. రైతులకు ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, పంట రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. మంత్రి ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చితే, ఖమ్మం జిల్లాలోని వేలాది రైతు కుటుంబాలకు భూమిపై పూర్తి హక్కులు లభిస్తాయి.
తాజావార్తలు
-
NBK112: బాలయ్య – కొరటాల సినిమా క్యాన్సిలా! కారణం ఇదేనా?
-
CM Revanth Reddy: మీరు కొనుకున్న భూమి ఎక్కడికీ పోదు.. నేనే రిజిస్ట్రేషన్ చేయిస్తా: సీఎం రేవంత్ రెడ్డి
-
Kolkata: కోల్కతా ఆస్పత్రిలో నర్సు మృతదేహం.. ఆర్జీకర్ తరహాలో కలకలం!
-
Bollywood vs South: పాత్ర కోసమా? పాపులారిటీ కోసమా? హీరోయిన్ల బోల్డ్ మేకోవర్పై హాట్ చర్చ!
-
Rahul Gandhi: అమెరికా-ఇరాన్లకు పాక్ మధ్యవర్తి.. మోడీ ఫారిన్ పాలసీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!