Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాలనలో సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే దిశగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2026, మే 06న 18 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. విద్యా మరియు భాషా విభాగానికి సంబంధించి తెలుగు అకాడెమీ చైర్మన్గా ప్రొ. వెంకటనారాయణ నియమితులయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. కమ్మ కార్పొరేషన్ బాధ్యతలను బండి రమేష్ (చైర్మన్), పరుచూరి మురళి (వైస్ చైర్మన్) చేపట్టగా.. వెలమ కార్పోరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగ్ రావు ఎంపికయ్యారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సారథులుగా బస్వరాజు శ్రీనివాస్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్లు వ్యవహరిస్తారు.
బీసీ కుల వృత్తుల బలోపేతానికి సంబంధించి యాదవ సహకార సంస్థకు ఎం. రఘునాథ్ యాదవ్ (చైర్మన్), గజ్జి భాస్కర్ యాదవ్ (వైస్ చైర్మన్).. గౌడ సహకార సంస్థకు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ (చైర్మన్), కేసం నాగరాజు గౌడ్ (వైస్ చైర్మన్) నియమితులయ్యారు. మున్నూరుకాపు సహకార సంస్థకు బొమ్మ శ్రీరామ్, అల్లం భాస్కర్లు చైర్మన్, వైస్ చైర్మన్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. చేనేత అభివృద్ధి సంస్థ (TSCO) బాధ్యతలను దూడెం వెంకట్ రమణ, జక్కని అనితలకు అప్పగించగా.. పద్మశాలీ కార్పోరేషన్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ ఎంపికయ్యారు.
Also Read
- CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
మరికొన్ని కీలక నియామకాల్లో వడ్డెర సహకార సంస్థకు గుంజా రేణుక నారాయణ మరియు బత్తుల వెంకటేష్, రజక సహకార సంస్థకు డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ మరియు బంగారు బాబు, మేర సహకార సంస్థకు సంగ వెంకటరాజం మరియు ఎం. లక్ష్మీ నారాయణలు ఎంపికయ్యారు. వాల్మీకి బోయ సంస్థకు గట్టు తిమ్మప్ప, బోయ నాగేష్లు.. పెరిక సహకార సంస్థకు దొంగరి వెంకటేశ్వర్లు, బుడగం శ్రీనివాస్లు నాయకత్వం వహించనున్నారు.
పశుసంవర్ధక రంగానికి సంబంధించి గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్పర్సన్గా కొల్లె సరిత, లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చైర్మన్గా చరణ్ కౌశిక్ యాదవ్లను ప్రభుత్వం నియమించింది. భట్టరాజ కోఆపరేటివ్ ఫెడరేషన్ బాధ్యతలను సీహెచ్. బాల్ రాజుకు అప్పగించారు. చివరగా.. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా సూదిని రామిరెడ్డి నియమితులు కాగా, అందులో సభ్యులుగా కృష్ణ కుమార్ నాగులూరి, బూస వేణుగోపాల్ యాదవ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
-
CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్లు వైరల్
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!