Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాలనలో సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే దిశగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2026, మే 06న 18 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. విద్యా మరియు భాషా విభాగానికి సంబంధించి తెలుగు అకాడెమీ చైర్మన్గా ప్రొ. వెంకటనారాయణ నియమితులయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. కమ్మ కార్పొరేషన్ బాధ్యతలను బండి రమేష్ (చైర్మన్), పరుచూరి మురళి (వైస్ చైర్మన్) చేపట్టగా.. వెలమ కార్పోరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగ్ రావు ఎంపికయ్యారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సారథులుగా బస్వరాజు శ్రీనివాస్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్లు వ్యవహరిస్తారు.
బీసీ కుల వృత్తుల బలోపేతానికి సంబంధించి యాదవ సహకార సంస్థకు ఎం. రఘునాథ్ యాదవ్ (చైర్మన్), గజ్జి భాస్కర్ యాదవ్ (వైస్ చైర్మన్).. గౌడ సహకార సంస్థకు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ (చైర్మన్), కేసం నాగరాజు గౌడ్ (వైస్ చైర్మన్) నియమితులయ్యారు. మున్నూరుకాపు సహకార సంస్థకు బొమ్మ శ్రీరామ్, అల్లం భాస్కర్లు చైర్మన్, వైస్ చైర్మన్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. చేనేత అభివృద్ధి సంస్థ (TSCO) బాధ్యతలను దూడెం వెంకట్ రమణ, జక్కని అనితలకు అప్పగించగా.. పద్మశాలీ కార్పోరేషన్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ ఎంపికయ్యారు.
Also Read
- Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
- CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
- BJP Bengal Win: పాక్ నుంచి యూఎస్ వరకు.. బీజేపీ బెంగాల్ విక్టరీపై అంతర్జాతీయ చర్చ..
- TVK Vijay: విజయ్కు వామపక్షాలు బిగ్ షాక్.. మద్దతు ఇవ్వబోమని ప్రకటన
మరికొన్ని కీలక నియామకాల్లో వడ్డెర సహకార సంస్థకు గుంజా రేణుక నారాయణ మరియు బత్తుల వెంకటేష్, రజక సహకార సంస్థకు డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ మరియు బంగారు బాబు, మేర సహకార సంస్థకు సంగ వెంకటరాజం మరియు ఎం. లక్ష్మీ నారాయణలు ఎంపికయ్యారు. వాల్మీకి బోయ సంస్థకు గట్టు తిమ్మప్ప, బోయ నాగేష్లు.. పెరిక సహకార సంస్థకు దొంగరి వెంకటేశ్వర్లు, బుడగం శ్రీనివాస్లు నాయకత్వం వహించనున్నారు.
పశుసంవర్ధక రంగానికి సంబంధించి గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్పర్సన్గా కొల్లె సరిత, లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చైర్మన్గా చరణ్ కౌశిక్ యాదవ్లను ప్రభుత్వం నియమించింది. భట్టరాజ కోఆపరేటివ్ ఫెడరేషన్ బాధ్యతలను సీహెచ్. బాల్ రాజుకు అప్పగించారు. చివరగా.. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా సూదిని రామిరెడ్డి నియమితులు కాగా, అందులో సభ్యులుగా కృష్ణ కుమార్ నాగులూరి, బూస వేణుగోపాల్ యాదవ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!