Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పాలనలో సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించే దిశగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 2026, మే 06న 18 కీలక కార్పొరేషన్లకు చైర్మన్లను, 11 వైస్ చైర్మన్లను ఖరారు చేశారు. విద్యా మరియు భాషా విభాగానికి సంబంధించి తెలుగు అకాడెమీ చైర్మన్గా ప్రొ. వెంకటనారాయణ నియమితులయ్యారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే.. కమ్మ కార్పొరేషన్ బాధ్యతలను బండి రమేష్ (చైర్మన్), పరుచూరి మురళి (వైస్ చైర్మన్) చేపట్టగా.. వెలమ కార్పోరేషన్ చైర్మన్గా జువ్వాడి నర్సింగ్ రావు ఎంపికయ్యారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ సారథులుగా బస్వరాజు శ్రీనివాస్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్లు వ్యవహరిస్తారు.
బీసీ కుల వృత్తుల బలోపేతానికి సంబంధించి యాదవ సహకార సంస్థకు ఎం. రఘునాథ్ యాదవ్ (చైర్మన్), గజ్జి భాస్కర్ యాదవ్ (వైస్ చైర్మన్).. గౌడ సహకార సంస్థకు మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ (చైర్మన్), కేసం నాగరాజు గౌడ్ (వైస్ చైర్మన్) నియమితులయ్యారు. మున్నూరుకాపు సహకార సంస్థకు బొమ్మ శ్రీరామ్, అల్లం భాస్కర్లు చైర్మన్, వైస్ చైర్మన్లుగా బాధ్యతలు తీసుకోనున్నారు. చేనేత అభివృద్ధి సంస్థ (TSCO) బాధ్యతలను దూడెం వెంకట్ రమణ, జక్కని అనితలకు అప్పగించగా.. పద్మశాలీ కార్పోరేషన్ చైర్మన్గా గూడూరు శ్రీనివాస్ ఎంపికయ్యారు.
Also Read
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
- CM Vijay: సింహాసనం విజయ్ది.. వ్యూహం కాంగ్రెస్ది.. నట్టేట మునిగిన ఏఐఏడీఎంకే రెబల్స్..!
మరికొన్ని కీలక నియామకాల్లో వడ్డెర సహకార సంస్థకు గుంజా రేణుక నారాయణ మరియు బత్తుల వెంకటేష్, రజక సహకార సంస్థకు డాక్టర్ దాసరిరాజు అజయ్ కుమార్ మరియు బంగారు బాబు, మేర సహకార సంస్థకు సంగ వెంకటరాజం మరియు ఎం. లక్ష్మీ నారాయణలు ఎంపికయ్యారు. వాల్మీకి బోయ సంస్థకు గట్టు తిమ్మప్ప, బోయ నాగేష్లు.. పెరిక సహకార సంస్థకు దొంగరి వెంకటేశ్వర్లు, బుడగం శ్రీనివాస్లు నాయకత్వం వహించనున్నారు.
పశుసంవర్ధక రంగానికి సంబంధించి గొర్రెలు, మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్పర్సన్గా కొల్లె సరిత, లైవ్ స్టాక్ డెవలప్ మెంట్ ఏజెన్సీ చైర్మన్గా చరణ్ కౌశిక్ యాదవ్లను ప్రభుత్వం నియమించింది. భట్టరాజ కోఆపరేటివ్ ఫెడరేషన్ బాధ్యతలను సీహెచ్. బాల్ రాజుకు అప్పగించారు. చివరగా.. తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా సూదిని రామిరెడ్డి నియమితులు కాగా, అందులో సభ్యులుగా కృష్ణ కుమార్ నాగులూరి, బూస వేణుగోపాల్ యాదవ్లు బాధ్యతలు నిర్వహించనున్నారు.
తాజావార్తలు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
-
Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
-
K Pajanivel: పద్మశ్రీ పురస్కారం స్వీకరించే ముందు.. ప్రధాని మోడీకి సాష్టాంగ నమస్కారం.. కె. పజనివేల్ ఎవరు?
-
OTR : ఏపీ రాజకీయాల్లో లెటర్ వార్.. పవన్ కల్యాణ్ కు బొత్స సంచలన లేఖ..?
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?