Compensation: వడదెబ్బ మృతులకు రూ.4 లక్షల పరిహారం.. ఎలా పొందాలంటే..
- వడదెబ్బతో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం..
- గత ఏడాది ఎక్స్ గ్రేషియా పెంచుతూ రేవంత్ సర్కార్ ఉత్తర్వులు జారీ..
- డెత్ సర్టిఫికేట్, పోస్ట్మార్టం, ఎఫ్.ఐ.ఆర్ రిపోర్టులు తప్పనిసరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా సామాన్యులు, శ్రామికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేసే క్రమంలో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఈ వడదెబ్బతో మరణించిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వారికిచ్చే ఎక్స్గ్రేషియాను గతేడాది పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న రూ. 50 వేల ఎక్స్గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (SDMA) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. ఈ పరిహారం పొందేందుకు పాటించాల్సిన నిబంధనలపై అవగాహన లేక చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి.
Also Read:TTD: భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
Also Read
- Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
- Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
- MLC Ananthababu: ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పు రేపటికి వాయిదా!
- Stock Market: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?
ఏం చేయాలి..?
వడదెబ్బ మరణాలను ధ్రువీకరించడానికి ప్రతి మండలంలో ఒక త్రిసభ్య కమిటీ ఉంటుంది. ఇందులో తహసీల్దార్, వైద్యాధికారి, సబ్ ఇన్స్పెక్టర్ (SI) సభ్యులుగా ఉంటారు. మరణం సంభవించిన వెంటనే ఈ కమిటీకి సమాచారం అందించాల్సి ఉంటుంది.
వ్యక్తి వడదెబ్బతోనే మృతి చెందినట్లు తొలుత వైద్యాధికారి ధ్రువీకరించాలి. తర్వాత కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేసి పంచనామా నిర్వహిస్తారు. వడదెబ్బ మరణాలను శాస్త్రీయంగా నిర్ధారించడానికి మృతదేహానికి తప్పనిసరిగా పోస్ట్మార్టం నిర్వహించాలి. ఈ నివేదిక పరిహారానికి అత్యంత కీలకంగా ఉంటుంది.
Also Read:VB-G RAM G: ఉపాధి హామీ పథకం.. రూ.50 వేలు గెలుచుకునే అవకాశం.. ఎలా అంటే..
పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ సిద్ధం చేస్తారు. డెత్ సర్టిఫికేట్, పోస్ట్మార్టం రిపోర్ట్, ఎఫ్.ఐ.ఆర్, పంచనామా రిపోర్టులను జతచేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేయాలి. మండల కమిటీ పంపిన నివేదికను ఆర్డీఓ (RDO) , జిల్లా కలెక్టర్ పరిశీలించి.. మృతుడి కుటుంబానికి రూ. 4 లక్షల పరిహారాన్ని మంజూరు చేస్తారు.
తాజావార్తలు
-
Spirit Release Date: సల్మాన్ ఖాన్ వర్సెస్ ప్రభాస్.. ‘స్పిరిట్’ డేట్ ఫిక్స్.. రూమర్స్ అన్నీ తుడిచిపెట్టేసిన మేకర్స్!
-
Sheraz Mehdi: టాలీవుడ్లో ఓ రకమైన మాఫియా.. హీరో సంచలన వ్యాఖ్యలు!
-
Peddi : పెద్ది ఎడిటింగ్’లో బిజీగా బుచ్చి.. అస్సలు వదిలేదే లే!
-
Mamata Banerjee: మమత, అభిషేక్ బెనర్జీలకు ఊరట.. భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
-
Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఏం జరుగుతుంది..? ఎలా సీఎం పదవి నుంచి తొలగించవచ్చు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!