తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో భానుడు భగభగ మండుతున్నాడు. ముఖ్యంగా ఈ ఎండల కారణంగా సామాన్యులు, శ్రామికులు, రైతులు, ఉపాధి హామీ కూలీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జీవనోపాధి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా పనిచేసే క్రమంలో చాలామంది వడదెబ్బకు గురవుతున్నారు. అయితే ఈ వడదెబ్బతో మరణించిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం వారికిచ్చే ఎక్స్గ్రేషియాను గతేడాది పెంచిన విషయం తెలిసిందే. గతంలో ఉన్న రూ. 50 వేల ఎక్స్గ్రేషియాను రూ. 4 లక్షలకు పెంచుతూ స్టేట్…