Site icon NTV Telugu

పల్లె దవాఖానాలపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన

పల్లె దవాఖానలపై మంత్రి హారీష్‌ రావు కీలక ప్రకటన చేశారు. సిద్ధిపేట జిల్లా మండల కేంద్రమైన చిన్నకోడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మంది ఆశా కార్యకర్తలకు జియో 4జీ మొబైల్ సిమ్ కార్డుల పంపిణీ చేశారు మంత్రి హరీష్‌ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు ప్రభుత్వ వైద్యం చేరువలో తేవాలనే లక్ష్యంగా సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా భవిష్యత్తులో ప్రతీ పల్లెకు పల్లె దవాఖానలు తెస్తామని స్పష్టం చేశారు హరీష్‌ రావు.

ప్రతీ పల్లె ప్రాథమిక ఉప కేంద్రంలో స్టాఫ్ నర్సు, ఏఏన్ఏఎంలు, వైద్యులు అందుబాటులో ఉంటారని వెల్లడించారు. ప్రజలను ఆరోగ్యంగా కాపాడుకోవడం ప్రభుత్వ బాధ్యత అని…. ప్రజలలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా ఓపికతో పని చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి పిలుపునిచ్చారు మంత్రి హరీష్‌ రావు. నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలన్నారు.

Exit mobile version