Caste Census: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేటి (ఫిబ్రవరి 16) నుంచి ఫిబ్రవరి 28, 2025 వరకు సర్వే పూర్తిగా చేయించుకొని కుటుంబాలకు మరో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది. తాళం వేసి ఉన్న ఇళ్లు, ఆసక్తి లేని కుటుంబాలు వంటి కారణాలతో సర్వే జరగని ఇళ్ల సంఖ్య 3,56,323గా నమోదైంది. ఈ గృహాలు తమ గణనను పూర్తిచేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
Read Also: Elon Musk: తన కొడుకుకు ఇండియన్ సైంటిస్ట్ పేరు పెట్టిన ఎలాన్ మాస్క్.. ఇంతకీ ఎవరతను?
గణనను పూర్తిచేసుకోవడానికి మూడు మార్గాలను ప్రభుత్వం సూచించింది.
* టోల్-ఫ్రీ నంబర్కు కాల్ చేయడం:
తెలంగాణలో ఎక్కడి నుండైనా 040-21111111 నంబర్కు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్ చేయవచ్చు. వ్యక్తిగత వివరాలను ధ్రువీకరించిన తర్వాత, అధికారుల ద్వారా ఒక ఎన్యుమరేటర్ మీ ఇంటికి వచ్చి గణన ప్రక్రియను పూర్తి చేస్తారు.
* ప్రజాపాలన సేవా కేంద్రాల (PPSK) ద్వారా నమోదు:
గ్రామీణ ప్రాంతాల్లోని MPDO కార్యాలయాల్లో, పట్టణాల్లోని వార్డు కార్యాలయాల్లో గణన పూర్తి చేసుకోవచ్చు. శిక్షణ పొందిన సిబ్బంది ప్రజలకు సర్వే ఫారమ్ నింపడంలో సహాయపడతారు.
Read Also: New Delhi : న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట.. 18 మంది మృతి
* ఆన్లైన్ ఫారమ్ డౌన్లోడ్ & సమర్పణ
సర్వే ఫారమ్ను https://seeepcsurvey.cgg.gov.in వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పూర్తిగా నింపి, సంతకం చేసిన అనంతరం సమీపంలోని ప్రజాపాలన సేవా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది.
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఇంకా గణన చేయించని కుటుంబాలు తమ వివరాలను అధికారికంగా నమోదు చేసుకోవచ్చు.