New Liquor Brands: కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం..
- కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
- అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శకత
- కట్టుదిట్టంగా కొత్త కంపెనీలకు అనుమతులు
- నాసిరకం కంపెనీలకు నో ఎంట్రీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్త మద్యం బ్రాండ్లపై సీఎం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో పారదర్శక విధానం రూపొందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏడాదిలో ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బ్రాండ్లకు దరఖాస్తు చేసుకునే అవకాశముండేది. ఎవరికి పడితే వారికి అనుమతించే విధానముండేది. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు దరఖాస్తులు తీసుకోవద్దని.. కట్టుదిట్టంగా కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చే విధానం అనుసరించాలని సూచించారు. నోటిఫికేషన్ జారీ చేసి నిర్ణీత వ్యవధిలో దరఖాస్తులు స్వీకరించాలన్నారు. దరఖాస్తు చేసుకున్న కంపెనీల నాణ్యత, మార్కెట్లో వాటికి ఉన్న ఆదరణ, సరఫరా సామర్థ్యం ఆధారంగా కొత్త కంపెనీలకు అనుమతి ఇవ్వాలని పేర్కొన్నారు.
READ MORE: Kangana Ranaut: ‘ఎమర్జెన్సీ’ మూవీ స్పెషల్ షో.. కంగనను ప్రశంసించిన కేంద్ర మంత్రి
Also Read
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- Google Earthquake Alert: భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్.. కాంతి వేగంతో మొబైల్ స్క్రీన్లపైకి వార్నింగ్.. కానీ..
“ఇష్టమోచ్చిన చెత్త పేర్లతో వచ్చేవి.. నాసిరకం కంపెనీలకు నో ఎంట్రీ. బీరు బిర్యానీ లాంటి బీర్ బ్రాండ్లకు చెక్ పెట్టాలి. ఇప్పటికే రాష్ట్రంలో బీర్లు, లిక్కర్ సరఫరా చేస్తున్న కంపెనీలు మళ్లీ మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత కంపెనీలు కొత్త బ్రాండ్లు ఉత్పత్తి చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానంలో వాటిని పరిశీలించి అనుమతించే పద్ధతి అనుసరించాలి. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ వద్ద పెండింగ్లో ఉన్న మైక్రో బ్రూవరీలు, ఎలైట్ బార్ల అప్లికేషన్లు, ఖాళీగా ఉన్న ఎలైట్ బార్లు, ఖాళీగా ఉన్న మద్యం షాపుల కేటాయింపుల విషయంలో త్వరలో కొత్త విధానం తెస్తున్నాం. గతంలో టానిక్ లాంటి ఎలైట్ షాపులకు అనుమతించటంతో బడా వ్యాపారులు ఎక్సైజ్ శాఖను తమ గుప్పిట పెట్టుకున్నారు. తాము ఆడిందే ఆట అన్నట్లుగా ఎక్సైజ్ శాఖ ఆదాయానికి భారీగా గండి కొట్టారు. ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా ఎక్సైజ్ శాఖ కట్టుదిట్టంగా వ్యవహరించాలి.” అని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి ఎక్సైజ్ ఆదాయం గండి పడకుండా కొత్త ప్రతిపాదనలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
తాజావార్తలు
-
Mirzapur The Movie : మిర్జాపూర్: ది మూవీ’ టీజర్ విడుదల
-
OTT Movies: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే తెలుగు, తమిళ సినిమాలు
-
YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
-
iQOO Neo11s: ఐకూ Neo11s వచ్చేస్తోంది.. 8000mAh భారీ బ్యాటరీ, 144Hz 2K డిస్ప్లేతో గేమర్లకు కొత్త పవర్హౌస్!
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
ట్రెండింగ్
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!
-
IND vs BAN: నేడు టీమిండియాకు కీలక మ్యాచ్.. గెలవకుంటే ఇంటికే.. కొడితే గట్టిగా కొట్టాల్సిందే!
-
ట్యాబ్లెట్ కాదు.. మినీ ల్యాప్టాప్! 13-అంగుళాల 3.5K డిస్ప్లే, 144Hz డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో Moto Pad 70 Pro..