Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
- తెలంగాణలో ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం..
- ఇకపై అన్ని సినిమాలు పర్సంటేజ్ విధానంలోనే ప్రదర్శించాలని నిర్ణయం
- ‘పెద్ది’ సినిమాకూ ఇదే నిబంధన వర్తిస్తుందని స్పష్టం
- పర్సంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమాను ప్రదర్శిస్తామని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Exhibitors Association: తెలంగాణలో సినిమా ప్రదర్శన విధానంపై తెలంగాణ ఎక్జిబిటర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తెలంగాణలో విడుదలయ్యే ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శిస్తామని స్పష్టం చేసింది. ముఖ్యంగా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న పెద్ది (Peddi) సినిమాకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని సంఘం వెల్లడించింది.
తాజాగా నిర్వహించిన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. “మాకు ‘పెద్ది’ సినిమాకు కూడా పర్సంటేజ్ కావాలని తేల్చి చెప్పారు. అది ఎంత ఇవ్వాలన్నది నిర్ణయించాలి. పర్సంటేజ్ ఇస్తేనే తెలంగాణలో సినిమా ప్రదర్శిస్తాం” అని స్పష్టం చేశారు. నిర్మాతలు కావాలనే ఈ అంశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని ఈ సందర్బంగా వారు ఆరోపించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
- Hindu Rate of Growth: ప్రధాని మోడీ ప్రస్తావించిన 'హిందూ గ్రోత్ రేట్' అంటే ఏంటి? షాకింగ్ నిజాలు..
ఇదివరకు హరిహర వీరమల్లు సినిమా సమయంలో తమ డిమాండ్ను వినిపించామని.. అయితే ఆ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా వెనక్కి తగ్గామని తెలిపారు. ఆ తర్వాత నుంచి పర్సంటేజ్ విధానం గురించి నిరంతరం చర్చలు జరుపుతున్నప్పటికీ నిర్మాతల నుంచి స్పష్టత రాలేదని పేర్కొన్నారు. ‘పెద్ది’ సినిమా కూడా వాయిదా పడుతూ ఈ దశకు వచ్చిందని, అయినప్పటికీ ఈ సినిమాను వదిలేసి తర్వాతి పెద్ద సినిమాకు ఈ నిబంధన అమలు చేద్దామని కొందరు సూచించారని తెలిపారు. మరోవైపు నిర్మాతలు మూడు వారాల సమయం కోరారని, అయితే ఇక ఆలస్యం సరైంది కాదని భావించి ‘పెద్ది’ సినిమాను కూడా పర్సంటేజ్ పద్ధతిలోనే ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
టికెట్ ధరల పెంపుపై కూడా సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణలో సినిమా టికెట్ రేట్లు పెంచకూడదని సంఘాల తరఫున సీఎం రేవంత్ రెడ్డికు మెమొరాండం ఇచ్చినట్లు తెలిపారు. టికెట్ ధరలు పెంచడం వల్ల ప్రేక్షకులు దూరమవుతారని, అలాంటి నిర్ణయాలతో సినిమాను చంపవద్దని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. అలాగే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తరఫున చివరిగా ఒకే మాట చెబుతున్నామని.. ఇకపై ఏ సినిమా అయినా పర్సంటేజ్ విధానంలోనే తమ థియేటర్లలో ప్రదర్శించబడుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా ఎగ్జిబిటర్ జువ్వాడి శేఖర్ రావు ఎన్నికయ్యారు. ఇటీవల ఆ పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
థియేటర్లలో రెంట్ ట్రాక్ విధానాన్ని అమలు చేయడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఎక్కడా ఫ్రాడ్ జరగడం లేదని.. పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. అలాగే థియేటర్ల గ్రేడింగ్ విషయంలో కూడా.. థియేటర్లలో ఉన్న సౌండ్ సిస్టమ్, ఏసీలు వంటి సౌకర్యాల ఆధారంగా కాకుండా, ఆయా థియేటర్లకు వచ్చే కలెక్షన్ల ఆధారంగానే గ్రేడింగ్ చేయాలని సూచించారు. అలాంటి గ్రేడింగ్ విధానానికి మాత్రమే తాము అంగీకరిస్తామని స్పష్టం చేశారు.
పెద్ది సినిమాపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు తెలిపారు. “పెద్ది లాంటి సినిమాలకు మేము సెల్యూట్ చేస్తాం. ఆ సినిమాపై మాకు ఎలాంటి పగ లేదు” అని పేర్కొన్నారు. మొదట ఈ వివాదం నుంచి ‘పెద్ది’ సినిమాను మినహాయించాలని అనుకున్నామని, అయితే ఆ సినిమా తర్వాత కూడా తమ సమస్యలను ఎప్పుడు పట్టించుకుంటారో స్పష్టత లేకపోవడంతో చివరికి ‘పెద్ది’ సినిమాను కూడా ప్రదర్శించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
-
Aluminium Foil: చైనాకు భారత్ గట్టి దెబ్బ! ఈ లోహంపై యాంటీ-డంపింగ్ సుంకం పొడిగింపు..’మేక్ ఇన్ ఇండియా’కు బలం
-
Jagapathi Babu : ‘పెద్ది’ని దించాలని కొందరు ఇడియట్స్ ప్రయత్నించారు.. ట్రోలర్స్ కి జగ్గూ భాయ్ స్ట్రాంగ్ కౌంటర్
-
Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి ‘మేడ్ ఇన్ ఇండియా’ మిలిటరీ విమానం..
-
EDLI Scheme: పీఎఫ్ ఖాతా ఉందా? ఉచితంగా రూ.7 లక్షల జీవిత బీమా.. EPF అందించే ఈ ప్రయోజనం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!