Ponnam Prabhakar : తాగు, సాగునీటికి డోకా లేదు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponnam Prabhakar : తాగునీటి సరఫరా అంశాన్ని రాజకీయం చేయడం అసంతృప్తికరమని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. “కొంతమంది నాయకులు కావాలని అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
ఎల్ఎండి, మిడ్ మానేరు ప్రాజెక్టులలో తాగునీటి అవసరాలకు తగినన్ని నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఈసారి నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నట్లు ఆయన వివరించారు. కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టు తాగునీటి అవసరాల కోసం తగినన్ని నీటి నిల్వలు ఉంచామని, మిగిలిన నీటిని సాగునీటి అవసరాల కోసం వదులుతున్నట్లు వెల్లడించారు.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
నీటి నిల్వలు – గణాంకాలతో స్పష్టత
గత ఏడాది ఇదే రోజున లోయర్ మానేరు డ్యామ్ (LMD) లో 5.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 5.700 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేరు డ్యామ్ లో గత ఏడాది 8.00 టీఎంసీలు ఉండగా, ఈ ఏడాది 9.480 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయి. జూలై 31 వరకు లోయర్ మానేరు డ్యాంలో తాగునీటి అవసరాల కోసం 6.90 టీఎంసీలు అవసరం అని ఆయన తెలిపారు.
మిడ్ మానేరు డ్యామ్ నుంచి 3.00 టీఎంసీల నీటిని లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. సాగునీటి అవసరాల కోసం జోన్-2 ఆయకట్టుకు ఈ నెల 6 వరకు 2500 క్యూసెక్కుల నీటిని అందించనున్నట్లు మంత్రి వివరించారు.
“కరీంనగర్ మున్సిపాలిటీ, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు తాగునీటి కొరత లేదని” మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొన్ని వర్గాలు కావాలని తాగునీటి సరఫరాపై అనవసరమైన అపోహలు కలిగించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయి అని ఆరోపించారు. “ప్రజలు నిజాన్ని అర్థం చేసుకుంటారు, అసత్య ప్రచారాలు చేసే వారికి తగిన బుద్ధి చెబుతారు” అని ఆయన హెచ్చరించారు.
ప్రభుత్వం తాగునీటి సమస్యలను ముందస్తుగా అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని, నిరాధార ఆరోపణలను విశ్వసించవద్దని మంత్రి కోరారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్చుక్ లేఖ..
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!