CM Revanth Reddy : రెండో రోజు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- దావోస్ సదస్సులో ముఖ్యమైన కార్యక్రమాలుణ
- తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలు
- ప్రతినిధి బృందం ప్రయాణం:
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో (WEF) పాల్గొన్నారు. కేంద్ర మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గ్రాండ్ ఇండియా పావిలియన్ను ప్రారంభించారు. ఈరోజు ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. నిన్న దావోస్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందం వివిధ దేశాల ప్రముఖులతో పాటు ఇండియాకు చెందిన గౌరవ అతిథులతో భేటీ అయ్యింది. మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య ప్రసంగం చేస్తూ, తెలంగాణలో పారిశ్రామిక వృద్ధిని హైలైట్ చేశారు. బయోటెక్నాలజీ, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి, పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు.
తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలు:
Also Read
తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వ లక్ష్యమైన 5 ట్రిలియన్ ఎకానమీలో తెలంగాణకు అధిక భాగస్వామ్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు.
ప్రతినిధి బృందం ప్రయాణం:
జ్యూరిచ్ నుండి దావోస్ వరకు రైలులో ప్రయాణించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దావోస్లో వారి బృందానికి ఘన స్వాగతం లభించగా, తెలుగు వారితో పాటు వివిధ ప్రతినిధులు అభినందనలు తెలిపారు.
అంతకుమందు.. సింగపూర్ నుంచి జ్యూరిచ్ చేరుకున్న రేవంత్ రెడ్డి బృందానికి విమానాశ్రయంలో తెలుగు వారు గౌరవాభినందనలు తెలుపుతూ ఘన స్వాగతం ఇచ్చారు. ఈ పర్యటన తెలంగాణ ప్రభుత్వం యొక్క అభివృద్ధి లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పేందుకు సహాయపడుతుందని అంచనా.
Donald Trump 2.0: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం
తాజావార్తలు
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
-
Chiru Bobby 2 :మెగాస్టార్ కొత్త లుక్.. బాబీతో క్రేజీ మూవీ ముహూర్తం ఫిక్స్.!
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..