NTV Telugu Site icon

TS Cabinet: ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ

Ts Cabinet

Ts Cabinet

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, సీఎస్ శాంతికుమారి, వివిధ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. 6 గ్యారంటీలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అంతకుముందు ముఖ్యమంత్రిగా సచివాలయంలో రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. సచివాలయంలోకి అడుగుపెట్టగానే ఆయనకు పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత సచివాలయం లోపల రేవంత్ రెడ్డికి వేద పండితులు స్వాగతం పలికారు.