Site icon NTV Telugu

TS Cabinet : ‘జయ జయహే తెలంగాణ’ రాష్ట్ర గేయంగా కేబినెట్ ఆమోదం

Revanth Reddy

Revanth Reddy

రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి కేబినెట్‌ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబుతో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్​ రెడ్డి, రోహిత్​ రావు, అడ్లూరి లక్ష్మణ్​ కుమార్​, మాజీ ఎమ్మెల్యే ఏ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు. మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏమేం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు.

తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాలు..

200 యూనిట్ల ఉచిత కరెంటు పథకంకు క్యాబినెట్ ఆమోదం..

500 గ్యాస్ సిలిండర్ పథకంకు క్యాబినెట్ ఆమోదం..

వాహన నెంబర్ ప్లేట్ల మీద టీఎస్ ను టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం..

8 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..

జయ జయహే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గేయంగా కేబినెట్ ఆమోదం.

Exit mobile version