Kishan reddy: హోలీ వేడుకల్లో మహిళలపై దాడిని ఖండించిన కిషన్రెడ్డి
మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదుల దాడిని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవిక చర్యగా అభివర్ణించారు.
‘‘మహిళలు ఆచారం ప్రకారం హోలీ పండుగ చేసుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. మహిళలపై దుర్భాషలాడుతూ మూకుమ్మడిగా రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో అనేకమందికి గాయపడ్డారు. ఈ దాడిలో గర్భిణీలతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు దోషులను పట్టుకోకుండా, కేసులు నమోదు చేయకుండా వివక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం. దాడికి సంబంధించి వీడియోల్లో కనపడుతున్నా పోలీసులు కేవలం దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం సబబు కాదు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి. హత్యానేరం కింద కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని కిషన్రెడ్డి తెలిపారు.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
‘‘పోలీసుల కళ్ళెదుటే మతోన్మాదులు విచక్షణ కోల్పోయి హిందూ మహిళలపై, పిల్లలపై దాడి చేస్తున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించారు. ఓ వైపు ఎలక్షన్ కోడ్ ఉన్నా.. దాడులు జరిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. స్లాట్ హౌస్ ఏరియాలో మజ్లిస్ పార్టీ అండతో మతోన్మాదులు మాఫియాగా ఏర్పడి రెచ్చిపోతున్నారు. మహిళలు, బాలింతలు అని చూడకుండా గిరిజనులపై దాడులకు తెగబడ్డారు. బాధిత గిరిజన మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్గా నామమాత్రంగా ట్రీట్ మెంట్ ఇస్తారా..? హిందువుల పట్ల గూండాలు చేసిన దాడిని నిలువరించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు.’’ అని కిషన్రెడ్డి ఆరోపించారు.
హిందూ మహిళలపై జరిగిన దాడి విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. బాధితులకు న్యాయం జరగకుంటే ఎంతవరకైనా పోరాడుతాం. ఓ వైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో పేద మహిళలపై దాడులు జరుగుతుంటే ఎందుకింత వివక్షంగా వ్యవహరిస్తోంది..? బాధితులకు మేం అండగా ఉంటాం.. అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. మాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. మహిళలు, పేదల రక్షణ ముఖ్యం. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి.. వాటిని పేదవారికి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి, మాఫియాకు చెందినవారికి కేటాయించారు.’’ అని కిషన్రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో