Kishan reddy: హోలీ వేడుకల్లో మహిళలపై దాడిని ఖండించిన కిషన్రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా హిందూ మహిళలపై అర్ధరాత్రి మతోన్మాదుల దాడిని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇది ఆటవిక చర్యగా అభివర్ణించారు.
‘‘మహిళలు ఆచారం ప్రకారం హోలీ పండుగ చేసుకుంటుంటే.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కొంతమంది మతోన్మాదులు మహిళలతో ఘర్షణకు దిగి దాడికి పాల్పడ్డారు. మహిళలపై దుర్భాషలాడుతూ మూకుమ్మడిగా రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో అనేకమందికి గాయపడ్డారు. ఈ దాడిలో గర్భిణీలతో పాటు మహిళలకు తలలు పగిలి తీవ్రగాయాలయ్యాయి. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగి 24 గంటలు దాటినా పోలీసులు దోషులను పట్టుకోకుండా, కేసులు నమోదు చేయకుండా వివక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం. దాడికి సంబంధించి వీడియోల్లో కనపడుతున్నా పోలీసులు కేవలం దర్యాప్తు పేరుతో కాలయాపన చేయడం సబబు కాదు. ఇప్పటికైనా దాడికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలి. హత్యానేరం కింద కేసులు నమోదు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని కిషన్రెడ్డి తెలిపారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
‘‘పోలీసుల కళ్ళెదుటే మతోన్మాదులు విచక్షణ కోల్పోయి హిందూ మహిళలపై, పిల్లలపై దాడి చేస్తున్నప్పటికీ ప్రేక్షక పాత్ర వహించారు. ఓ వైపు ఎలక్షన్ కోడ్ ఉన్నా.. దాడులు జరిగినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని ఖండిస్తున్నాం. స్లాట్ హౌస్ ఏరియాలో మజ్లిస్ పార్టీ అండతో మతోన్మాదులు మాఫియాగా ఏర్పడి రెచ్చిపోతున్నారు. మహిళలు, బాలింతలు అని చూడకుండా గిరిజనులపై దాడులకు తెగబడ్డారు. బాధిత గిరిజన మహిళల పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా ఆసుపత్రిలో ఔట్ పేషెంట్గా నామమాత్రంగా ట్రీట్ మెంట్ ఇస్తారా..? హిందువుల పట్ల గూండాలు చేసిన దాడిని నిలువరించడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారు.’’ అని కిషన్రెడ్డి ఆరోపించారు.
హిందూ మహిళలపై జరిగిన దాడి విషయాన్ని కేంద్ర ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. బాధితులకు న్యాయం జరగకుంటే ఎంతవరకైనా పోరాడుతాం. ఓ వైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామంటూ ప్రగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో పేద మహిళలపై దాడులు జరుగుతుంటే ఎందుకింత వివక్షంగా వ్యవహరిస్తోంది..? బాధితులకు మేం అండగా ఉంటాం.. అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. మాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. మహిళలు, పేదల రక్షణ ముఖ్యం. ఇక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి.. వాటిని పేదవారికి ఇవ్వకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారికి, మాఫియాకు చెందినవారికి కేటాయించారు.’’ అని కిషన్రెడ్డి ఆరోపించారు.
తాజావార్తలు
-
Gold ETF Outflows 2026: గోల్డ్ ఈటీఎఫ్లకు గుడ్బై చెబుతున్న ఇన్వెస్టర్లు.. కారణాలివే
-
Astrology: కెరీర్లో నెమ్మదిగా ఎదిగినా.. చివరికి పెద్ద స్థాయికి చేరుకునే 3 రాశులు ఇవేనా?
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!