Bandi Sanjay : కుల గణనే ఓ బోగస్ సర్వే
- కుల గణనే ఓ బోగస్ సర్వే
- తెలంగాణలో 4.3 కోట్లకుపైగా జనాభా ఉంది
- 3.95 కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి
- 3.35 కోట్ల మంది ఓటర్లున్నారు : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ సర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమన్నారు బండి సంజయ్. ఎందుకంటే కుల గణన సర్వే అంతా తప్పుల తడక అని ఆయన అన్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం… తెలంగాణలో 3 కోట్ల 35 లక్షలకుపైగా ఓటర్లున్నారు… అట్లాగే ఓటు హక్కు లేని వారి విషయానికొస్తే…. ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల సంఖ్య 60 లక్షలుగా నమోదైందన్నారు. వీరుగాక పాఠశాలకు వెళ్లని వారు, 0 నుండి 5 ఏళ్ల లోపు పిల్లలు మరో 30 లక్షలకుపైగా ఉందని, ఈ లెక్కన తెలంగాణ జనాభా 4 కోట్ల 30 లక్షలు దాటుతుందన్నారు బండి సంజయ్. తెలంగాణలో ఆధార్ కార్డులున్న వారి సంఖ్య 3 కోట్ల 95 లక్షలు. కానీ కుల గణన సర్వేలో తెలంగాణ జనాభా 3 కోట్ల 70 లక్షలుగా కుదించడం పెద్ద బూటకం. ఇది ఉత్తుత్తి సర్వే మాత్రమే. బీసీ సామాజికవర్గంలోని వివిధ కులాలకు చెందిన జనాభాను కుల గణన పేరుతో ఉద్దేశపూర్వకంగానే తగ్గించే కుట్ర చేసినట్లు స్పష్టంగా కన్పిస్తోందని ఆయన అన్నారు.
Its Complicated: ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అందుకే రీ రిలీజ్: సిద్ధు జొన్నలగడ్డ
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
- T20 World Cup: టీమిండియా ఘోర ఓటమి.. వరల్డ్ కప్ నుంచి ఔట్..
అంతేకాకుండా..’రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మళ్లీ ‘కుల గణన’ పేరుతో రీ సర్వే చేయాలి. ఆధార్ కార్డులను లింక్ చేసి ఇంటింటికీ వెళ్లి రీ సర్వే నిర్వహించాలి. దీంతోపాటు సర్వే పూర్తయిన వెంటనే గ్రామ పంచాయతీల్లో, వార్డుల్లో ముసాయిదా జాబితాను ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాలి. గ్రామ సభలు, వార్డు సభల ఆమోదంతో తుది జాబితాను ప్రకటించాలి. ఆ జాబితా మొత్తాన్ని పబ్లిక్ డొమైన్ లో ఉంచాలి. అప్పుడు మాత్రమే శాస్త్రీయ పద్దతిలో కుల గణన జరిగినట్లుగా భావిస్తాం. అట్లాకాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం, ప్రచారం కోసం తూతూ మంత్రంగా సర్వే చేయడంవల్ల ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఇకనైనా చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చినా, బీసీ సామాజిక కులాల జనాభాను తగ్గించాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం. కుల గణన విషయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల మధ్యే ఏకాభిప్రాయం కొరవడింది. అట్లాగే బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడాన్ని సొంత పార్టీ వాళ్లే తప్పు పడుతుంటే చేసిన తప్పును సరిదిద్దుకోకుండా కేంద్రంపై నిందలు మోపి తప్పించుకోవాలకోవడం సిగ్గు చేటు.’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Allahabad HC: అత్యాచార బాధితురాలు గర్భాన్ని వద్దనుకునే హక్కు ఉంది..
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!