Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి తిరిగి స్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని ధీటుగా తాము కూడా ప్రజంటేషన్ ఇచ్చేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సభలో మరోసారి చర్చలు వాడీవేడిగా కొనసాగే ఛాన్స్ ఉంది.
Read Also: Russia Ukraine War: 3.83లక్షల మందిని పొట్టన పెట్టుకున్న రష్యా
అయితే, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య హాట్ హాట్ గా చర్చలు జరిగాయి. తాజాగా మూడు రోజుల విరామం అనంతరం సభ ఇవాళ ఉదయం 11 గంటలకు స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- శ్వేత పత్రంపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు నిన్న (మంగళవారం) ఓ ప్రకటన రిలీజ్ చేశారు.