Bow and Arrow Symbol: ఉద్ధవ్-షిండే వర్గాలకు ఈసీ షాక్.. శివసేన ‘విల్లు బాణం’ గుర్తు ఫ్రీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bow and Arrow Symbol: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన గుర్తు అయిన “విల్లు – బాణం”ను ఫ్రీజ్ చేస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఉపఎన్నికల కోసం ఎల్లుండిలోగా మరో గుర్తును ఎంపిక చేసుకోవాలని ఉద్ధవ్, షిండే వర్గాలకు సూచించింది. ముంబైలోని ఈస్ట్ అంధేరి నియోజకవర్గానికి సంబంధించిన ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 3న జరగనున్న సంగతి తెలిసిందే. శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్న షిండే బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శివసేన తమదంటే కాదు… తమదని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే, షిండే వర్గాలు వాదులాడుకుంటున్నాయి. ఈ వ్యవహారం కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది.
Exotic Animals Seized: అక్రమంగా తరలిస్తున్న 665 అరుదైన, అన్యదేశ జంతువులు సీజ్..
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
తాజాగా శనివారం ఉద్ధవ్తో పాటు షిండే వర్గానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ నోటీసు జారీ చేసింది. శివసేనకు ఇప్పటిదాకా కొనసాగుతున్న ఎన్నికల గుర్తు విల్లంబును ఇరు వర్గాలూ వినియోగించడం కుదరదని ఎన్నికల సంఘం తెలిపింది. రెండు వర్గాల మధ్య వివాదం తేలే దాకా ఈ గుర్తును ఫ్రీజ్ చేస్తున్నట్లు కమిషన్ తెలిపింది. అంతేకాకుండా త్వరలో జరిగే ఉప ఎన్నికకు రెండు వర్గాలు తమ తమ గుర్తులను ఎంచుకోవాలని… అది కూడా రెండు రోజుల్లోగా తమ స్పందనను తెలియజేయాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది, ఇప్పుడు ముంబైలోని అంధేరీ ఈస్ట్లో జరగబోయే ఉప ఎన్నికల్లో వేరే పేరు, గుర్తును ఉపయోగించాల్సి ఉంటుంది. అంధేరీ ఈస్ట్ ఉపఎన్నికలో ఏకనాథ్ షిండే వర్గం పోటీ చేయడం లేదు. జూన్లో విడిపోయినప్పటి నుండి, బాల్ థాక్రే వారసత్వాన్ని కలుషితం చేశారని ఇరు వర్గాలు మరొకరిపై ఆరోపణలు చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!