IND vs NZ: 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా..
- 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
- 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసిన భారత్
- 1990లో న్యూజిలాండ్పై 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసిన ఇండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు. కొత్త బంతితో టీమిండియా పరుగులు చేయడంలో విఫలం కాగా.. వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. మరోవైపు.. మ్యాచ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కేవలం 46 పరుగులు చేసింది. ఇది స్వదేశంలో టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు. అయితే.. భారత్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పునరాగమనం చేసింది. 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసింది.
KCR Trailer: మరో బలగం లోడింగ్ లా ఉందే!
Also Read
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
- Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
న్యూజిలాండ్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన చేసిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో అద్భుత ప్రదర్శన చేశారు. రోహిత్-యశస్విలు జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ మధ్య 136 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. సర్ఫరాజ్, పంత్ నాలుగో వికెట్కు 177 పరుగులు చేశారు. భారత్ టెస్టుల్లో అత్యంత వేగంగా 450కి పైగా స్కోరు సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో భారత్ 4.64 రన్ రేట్తో 99.3 ఓవర్లలో 462 పరుగులు చేసింది. అంతకుముందు 1990లో న్యూజిలాండ్పై ఆక్లాండ్లో భారత్ 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసింది.
Remo DSouza: షాకింగ్: మరో డ్యాన్స్ కొరియోగ్రాఫర్పై కేసు
అంతకుముందు 2018 బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 4.52 రన్ రేట్తో 474 పరుగులు చేసింది. కాగా.. న్యూజిలాండ్ ముందు 107 పరుగుల విజయలక్ష్యం ఉంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్లో టెస్టులో గెలిచిన వారు అవుతారు. న్యూజిలాండ్ చివరిసారిగా భారత్లో 1989లో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది.
450 కంటే ఎక్కువ స్కోర్లలో భారత్కు అత్యధిక రన్ రేట్
4.64 – 462 (99.3) vs న్యూజిలాండ్, బెంగళూరు, 2024
4.61 – 482 (104.3) vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 1990
4.58 – 495 (108) vs వెస్టిండీస్, ముంబై ప్రపంచ కప్, 2013
4.52 – 474 (104.5) vs ఆఫ్ఘనిస్తాన్, బెంగళూరు, 2018
4.50 – 600 (133.1) vs శ్రీలంక, గాలె, 2017
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!