IND vs NZ: 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా..
- 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
- 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసిన భారత్
- 1990లో న్యూజిలాండ్పై 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసిన ఇండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు. కొత్త బంతితో టీమిండియా పరుగులు చేయడంలో విఫలం కాగా.. వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. మరోవైపు.. మ్యాచ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కేవలం 46 పరుగులు చేసింది. ఇది స్వదేశంలో టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు. అయితే.. భారత్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పునరాగమనం చేసింది. 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసింది.
KCR Trailer: మరో బలగం లోడింగ్ లా ఉందే!
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
న్యూజిలాండ్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన చేసిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో అద్భుత ప్రదర్శన చేశారు. రోహిత్-యశస్విలు జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ మధ్య 136 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. సర్ఫరాజ్, పంత్ నాలుగో వికెట్కు 177 పరుగులు చేశారు. భారత్ టెస్టుల్లో అత్యంత వేగంగా 450కి పైగా స్కోరు సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో భారత్ 4.64 రన్ రేట్తో 99.3 ఓవర్లలో 462 పరుగులు చేసింది. అంతకుముందు 1990లో న్యూజిలాండ్పై ఆక్లాండ్లో భారత్ 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసింది.
Remo DSouza: షాకింగ్: మరో డ్యాన్స్ కొరియోగ్రాఫర్పై కేసు
అంతకుముందు 2018 బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 4.52 రన్ రేట్తో 474 పరుగులు చేసింది. కాగా.. న్యూజిలాండ్ ముందు 107 పరుగుల విజయలక్ష్యం ఉంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్లో టెస్టులో గెలిచిన వారు అవుతారు. న్యూజిలాండ్ చివరిసారిగా భారత్లో 1989లో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది.
450 కంటే ఎక్కువ స్కోర్లలో భారత్కు అత్యధిక రన్ రేట్
4.64 – 462 (99.3) vs న్యూజిలాండ్, బెంగళూరు, 2024
4.61 – 482 (104.3) vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 1990
4.58 – 495 (108) vs వెస్టిండీస్, ముంబై ప్రపంచ కప్, 2013
4.52 – 474 (104.5) vs ఆఫ్ఘనిస్తాన్, బెంగళూరు, 2018
4.50 – 600 (133.1) vs శ్రీలంక, గాలె, 2017
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!