IND vs NZ: 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా..
- 34 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా
- 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసిన భారత్
- 1990లో న్యూజిలాండ్పై 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసిన ఇండియా.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరులో తొలి మ్యాచ్ జరుగుతోంది. సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మధ్య 177 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో.. భారత జట్టు మొదటి టెస్ట్ నాలుగో రోజు మ్యాచ్పై పట్టు బిగించింది. అయితే న్యూజిలాండ్ బౌలర్లు 54 పరుగులకు ఏడు వికెట్లు తీసి అద్భుతంగా పునరాగమనం చేశారు. కొత్త బంతితో టీమిండియా పరుగులు చేయడంలో విఫలం కాగా.. వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. మరోవైపు.. మ్యాచ్ రెండో రోజు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా కేవలం 46 పరుగులు చేసింది. ఇది స్వదేశంలో టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు. అయితే.. భారత్ రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పునరాగమనం చేసింది. 4.64 రన్ రేట్తో 450 కంటే ఎక్కువ వేగంతో స్కోర్ చేసింది.
KCR Trailer: మరో బలగం లోడింగ్ లా ఉందే!
Also Read
- Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
న్యూజిలాండ్తో జరిగిన తొలి ఇన్నింగ్స్లో భారత్ 46 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్లో పేలవ ప్రదర్శన చేసిన భారత బ్యాటర్లు.. రెండో ఇన్నింగ్స్లో అద్భుత ప్రదర్శన చేశారు. రోహిత్-యశస్విలు జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ మధ్య 136 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. సర్ఫరాజ్, పంత్ నాలుగో వికెట్కు 177 పరుగులు చేశారు. భారత్ టెస్టుల్లో అత్యంత వేగంగా 450కి పైగా స్కోరు సాధించిన రికార్డును తానే బద్దలు కొట్టుకుంది. న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో ఇన్నింగ్స్లో భారత్ 4.64 రన్ రేట్తో 99.3 ఓవర్లలో 462 పరుగులు చేసింది. అంతకుముందు 1990లో న్యూజిలాండ్పై ఆక్లాండ్లో భారత్ 4.61 రన్ రేట్తో 482 పరుగులు చేసింది.
Remo DSouza: షాకింగ్: మరో డ్యాన్స్ కొరియోగ్రాఫర్పై కేసు
అంతకుముందు 2018 బెంగళూరులో ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 4.52 రన్ రేట్తో 474 పరుగులు చేసింది. కాగా.. న్యూజిలాండ్ ముందు 107 పరుగుల విజయలక్ష్యం ఉంది. ఈ టెస్టులో న్యూజిలాండ్ విజయం సాధిస్తే.. 36 ఏళ్ల తర్వాత తొలిసారి భారత్లో టెస్టులో గెలిచిన వారు అవుతారు. న్యూజిలాండ్ చివరిసారిగా భారత్లో 1989లో ముంబైలో జరిగిన టెస్టు మ్యాచ్లో విజయం సాధించింది.
450 కంటే ఎక్కువ స్కోర్లలో భారత్కు అత్యధిక రన్ రేట్
4.64 – 462 (99.3) vs న్యూజిలాండ్, బెంగళూరు, 2024
4.61 – 482 (104.3) vs న్యూజిలాండ్, ఆక్లాండ్, 1990
4.58 – 495 (108) vs వెస్టిండీస్, ముంబై ప్రపంచ కప్, 2013
4.52 – 474 (104.5) vs ఆఫ్ఘనిస్తాన్, బెంగళూరు, 2018
4.50 – 600 (133.1) vs శ్రీలంక, గాలె, 2017
తాజావార్తలు
-
Casting Couch: ‘నువ్వు నాతో గడపాలనుకుంటే’… డైరెక్టర్ కు షరతు పెట్టిన నటి.. ఆ తరువాత ఏం జరిగిందో తెలిస్తే..
-
Prajwal Revanna: జైల్లో ప్రజ్వల్ రేవణ్ణతో మొబైల్, పెన్డ్రైవ్.. ఆ ఫోన్లలోనూ అశ్లీల వీడియోలు..!
-
Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
-
MSI Cyborg 15 Max C2W: ఎంఎస్ఐ Cyborg 15 Max గేమింగ్ ల్యాప్టాప్లు భారత్లో లాంచ్.. RTX 50 సిరీస్ GPU, 144Hz డిస్ప్లే
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..