Teacher Kidnap Incident: మలుపులు తిరుగుతున్న టీచర్ కిడ్నాప్ వ్యవహారం
- టీచర్ కిడ్నాప్ వ్యవహారంలో మలుపులు
- క్లాస్రూమ్లో ఉండగానే తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు
- తీసుకెళ్లిన వారు పోలీసులని నిర్ధారణ
- కుటుంబ సభ్యుల ఆందోళనతో వదిలేసిన పోలీసులు.
Teacher Kidnap Incident: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. మునీర్ అహ్మద్ అనే టీచర్ క్లాస్ రూమ్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. టీచర్ను తీసుకెళ్లింది పోలీసులని నిర్ధారణ అయింది. సీఐ పిలుస్తున్నాడని బలవంతంగా కారులో తోసుకుని ఇద్దరు మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారు. టీచర్ మునీర్తో పాటు సోదరుడు రిటైర్డ్ బ్యాంకు అధికారి మక్బుల్ను కూడా పోలీసులు తీసుకెళ్లారు. ఇద్దరిని కర్నూలు శివారు జిల్లా ట్రైనింగ్ సెంటర్లో వేర్వేరు బ్యారక్లలో 11గంటల పాటుల పోలీసులు నిర్బంధించారు. టీచర్ను తీసుకెళ్లింది పోలీసులని రాత్రి 10 గంటల వరకు తెలియక కుటుంబ సభ్యుల ఆందోళనకు గురయ్యారు. త్రీటౌన్ పీఎస్కు వెళ్లి తన భర్త ఆచూకీ చెప్పే వరకు వెళ్లేది లేదని బీష్మించడంతో రాత్రి 11 గంటలకు టీచర్ను పోలీసులు వదిలేశారు. రూ.20 కోట్లు విలువ చేసే భూవివాదంలో సెటిల్మెంట్ లో భాగంగా తీసుకెళ్లినట్లు బాధితుడు ఆరోపించారు. గత సెప్టెంబర్ నెలలోనూ స్కూల్కు వెళ్తుండగా మునీర్ అహ్మద్ను మధ్యలో కారు ఆపి పోలీసులు తీసుకెళ్లారు. భూవివాదంలో తనను పోలీసులు వేధిస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ ఆరోపించారు.
Read Also: High Tension in Tenali: తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత
Also Read
- Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
- Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
- Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
- Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో "మామిడికాయ టమాటా రోటి పచ్చడి".!
వందేళ్లుగా తమ తాతల నుంచి వచ్చిన ఆస్తి రాసివ్వాలని, ఇచ్చినంత తీసుకొని స్థలం అమ్మినట్టు రిజిస్టర్ చేయాలని బెదిరిస్తున్నారని టీచర్ మునీర్ తెలిపారు. కడప జిల్లాకు చెందిన విష్ణు అనే వ్యక్తి బెదిరిస్తున్నారని, పోలీస్ అధికారులు ఆయనకు ముద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. డీఐజీ కూడా పిలిపించి భూ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారని టీచర్ చెప్పుకొచ్చారు. భూమి వారికి ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు, ఇపుడు మట్కా నిర్వహకులతో సంబంధాలు ఉన్నాయని విచారిస్తున్నారని పేర్కొన్నారు. తనకు, తన భార్యకు, తన కూతురు ప్రాణాలకు ప్రమాదం ఉందని టీచర్ మునీర్ భయాందోళనను వ్యక్తం చేశారు. 2016 నుంచి అనేకసార్లు టీచర్ మునీర్ ను భూవివాదంలో పిలిపించి పోలీసులు విచారించినట్లు చెప్పారు. భూమి ఊరికే ఇవ్వద్దు …డబ్బులు ఇస్తామంటున్నారు…ఇవ్వడానికేమి అంటూ పోలీసు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనను కాపాడాలని టీచర్ మునీర్ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఏమైనా జరిగితే కడప జిల్లా కు చెందిన విష్ణు, కర్నూలుకు చెందిన ధనుంజయ, వారికి సపోర్ట్గా వుంటూ వేధించిన వారిదే బాధ్యత అని టీచర్ మునీర్ అన్నారు. వందేళ్ల మా తాతల నుంచి వచ్చిన భూమిని రాజకీయ నాయకుల ఒత్తిడితో రికార్డులు మార్చారని ఆరోపించారు.
- Tags
తాజావార్తలు
-
Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
-
Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
-
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?