Teacher Kidnap Incident: మలుపులు తిరుగుతున్న టీచర్ కిడ్నాప్ వ్యవహారం
- టీచర్ కిడ్నాప్ వ్యవహారంలో మలుపులు
- క్లాస్రూమ్లో ఉండగానే తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు
- తీసుకెళ్లిన వారు పోలీసులని నిర్ధారణ
- కుటుంబ సభ్యుల ఆందోళనతో వదిలేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher Kidnap Incident: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. మునీర్ అహ్మద్ అనే టీచర్ క్లాస్ రూమ్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. టీచర్ను తీసుకెళ్లింది పోలీసులని నిర్ధారణ అయింది. సీఐ పిలుస్తున్నాడని బలవంతంగా కారులో తోసుకుని ఇద్దరు మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారు. టీచర్ మునీర్తో పాటు సోదరుడు రిటైర్డ్ బ్యాంకు అధికారి మక్బుల్ను కూడా పోలీసులు తీసుకెళ్లారు. ఇద్దరిని కర్నూలు శివారు జిల్లా ట్రైనింగ్ సెంటర్లో వేర్వేరు బ్యారక్లలో 11గంటల పాటుల పోలీసులు నిర్బంధించారు. టీచర్ను తీసుకెళ్లింది పోలీసులని రాత్రి 10 గంటల వరకు తెలియక కుటుంబ సభ్యుల ఆందోళనకు గురయ్యారు. త్రీటౌన్ పీఎస్కు వెళ్లి తన భర్త ఆచూకీ చెప్పే వరకు వెళ్లేది లేదని బీష్మించడంతో రాత్రి 11 గంటలకు టీచర్ను పోలీసులు వదిలేశారు. రూ.20 కోట్లు విలువ చేసే భూవివాదంలో సెటిల్మెంట్ లో భాగంగా తీసుకెళ్లినట్లు బాధితుడు ఆరోపించారు. గత సెప్టెంబర్ నెలలోనూ స్కూల్కు వెళ్తుండగా మునీర్ అహ్మద్ను మధ్యలో కారు ఆపి పోలీసులు తీసుకెళ్లారు. భూవివాదంలో తనను పోలీసులు వేధిస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ ఆరోపించారు.
Read Also: High Tension in Tenali: తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత
Also Read
వందేళ్లుగా తమ తాతల నుంచి వచ్చిన ఆస్తి రాసివ్వాలని, ఇచ్చినంత తీసుకొని స్థలం అమ్మినట్టు రిజిస్టర్ చేయాలని బెదిరిస్తున్నారని టీచర్ మునీర్ తెలిపారు. కడప జిల్లాకు చెందిన విష్ణు అనే వ్యక్తి బెదిరిస్తున్నారని, పోలీస్ అధికారులు ఆయనకు ముద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. డీఐజీ కూడా పిలిపించి భూ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారని టీచర్ చెప్పుకొచ్చారు. భూమి వారికి ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు, ఇపుడు మట్కా నిర్వహకులతో సంబంధాలు ఉన్నాయని విచారిస్తున్నారని పేర్కొన్నారు. తనకు, తన భార్యకు, తన కూతురు ప్రాణాలకు ప్రమాదం ఉందని టీచర్ మునీర్ భయాందోళనను వ్యక్తం చేశారు. 2016 నుంచి అనేకసార్లు టీచర్ మునీర్ ను భూవివాదంలో పిలిపించి పోలీసులు విచారించినట్లు చెప్పారు. భూమి ఊరికే ఇవ్వద్దు …డబ్బులు ఇస్తామంటున్నారు…ఇవ్వడానికేమి అంటూ పోలీసు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనను కాపాడాలని టీచర్ మునీర్ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఏమైనా జరిగితే కడప జిల్లా కు చెందిన విష్ణు, కర్నూలుకు చెందిన ధనుంజయ, వారికి సపోర్ట్గా వుంటూ వేధించిన వారిదే బాధ్యత అని టీచర్ మునీర్ అన్నారు. వందేళ్ల మా తాతల నుంచి వచ్చిన భూమిని రాజకీయ నాయకుల ఒత్తిడితో రికార్డులు మార్చారని ఆరోపించారు.
- Tags
తాజావార్తలు
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
-
HMDA Mokila Layout : మోకిలా లేఅవుట్ ఈ-వేలానికి భారీ స్పందన.. HMDAకు రూ. 231.65 కోట్ల ఆదాయం.!
-
OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. ‘రెడ్ జోన్’ వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!