Teacher Kidnap Incident: మలుపులు తిరుగుతున్న టీచర్ కిడ్నాప్ వ్యవహారం
- టీచర్ కిడ్నాప్ వ్యవహారంలో మలుపులు
- క్లాస్రూమ్లో ఉండగానే తీసుకెళ్లిన ఇద్దరు వ్యక్తులు
- తీసుకెళ్లిన వారు పోలీసులని నిర్ధారణ
- కుటుంబ సభ్యుల ఆందోళనతో వదిలేసిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Teacher Kidnap Incident: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ కిడ్నాప్ వ్యవహారం మలుపులు తిరుగుతోంది. మునీర్ అహ్మద్ అనే టీచర్ క్లాస్ రూమ్లో ఉండగా ఇద్దరు వ్యక్తులు తీసుకెళ్లారు. టీచర్ను తీసుకెళ్లింది పోలీసులని నిర్ధారణ అయింది. సీఐ పిలుస్తున్నాడని బలవంతంగా కారులో తోసుకుని ఇద్దరు మఫ్టీ పోలీసులు తీసుకెళ్లారు. టీచర్ మునీర్తో పాటు సోదరుడు రిటైర్డ్ బ్యాంకు అధికారి మక్బుల్ను కూడా పోలీసులు తీసుకెళ్లారు. ఇద్దరిని కర్నూలు శివారు జిల్లా ట్రైనింగ్ సెంటర్లో వేర్వేరు బ్యారక్లలో 11గంటల పాటుల పోలీసులు నిర్బంధించారు. టీచర్ను తీసుకెళ్లింది పోలీసులని రాత్రి 10 గంటల వరకు తెలియక కుటుంబ సభ్యుల ఆందోళనకు గురయ్యారు. త్రీటౌన్ పీఎస్కు వెళ్లి తన భర్త ఆచూకీ చెప్పే వరకు వెళ్లేది లేదని బీష్మించడంతో రాత్రి 11 గంటలకు టీచర్ను పోలీసులు వదిలేశారు. రూ.20 కోట్లు విలువ చేసే భూవివాదంలో సెటిల్మెంట్ లో భాగంగా తీసుకెళ్లినట్లు బాధితుడు ఆరోపించారు. గత సెప్టెంబర్ నెలలోనూ స్కూల్కు వెళ్తుండగా మునీర్ అహ్మద్ను మధ్యలో కారు ఆపి పోలీసులు తీసుకెళ్లారు. భూవివాదంలో తనను పోలీసులు వేధిస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ ఆరోపించారు.
Read Also: High Tension in Tenali: తెనాలిలోని చంద్రబాబు నాయుడు కాలనీలో ఉద్రిక్తత
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
వందేళ్లుగా తమ తాతల నుంచి వచ్చిన ఆస్తి రాసివ్వాలని, ఇచ్చినంత తీసుకొని స్థలం అమ్మినట్టు రిజిస్టర్ చేయాలని బెదిరిస్తున్నారని టీచర్ మునీర్ తెలిపారు. కడప జిల్లాకు చెందిన విష్ణు అనే వ్యక్తి బెదిరిస్తున్నారని, పోలీస్ అధికారులు ఆయనకు ముద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. డీఐజీ కూడా పిలిపించి భూ వివాదం సెటిల్ చేసుకోమని చెప్పారని టీచర్ చెప్పుకొచ్చారు. భూమి వారికి ఇవ్వలేదని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు, ఇపుడు మట్కా నిర్వహకులతో సంబంధాలు ఉన్నాయని విచారిస్తున్నారని పేర్కొన్నారు. తనకు, తన భార్యకు, తన కూతురు ప్రాణాలకు ప్రమాదం ఉందని టీచర్ మునీర్ భయాందోళనను వ్యక్తం చేశారు. 2016 నుంచి అనేకసార్లు టీచర్ మునీర్ ను భూవివాదంలో పిలిపించి పోలీసులు విచారించినట్లు చెప్పారు. భూమి ఊరికే ఇవ్వద్దు …డబ్బులు ఇస్తామంటున్నారు…ఇవ్వడానికేమి అంటూ పోలీసు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని టీచర్ మునీర్ అహ్మద్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తనను కాపాడాలని టీచర్ మునీర్ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఏమైనా జరిగితే కడప జిల్లా కు చెందిన విష్ణు, కర్నూలుకు చెందిన ధనుంజయ, వారికి సపోర్ట్గా వుంటూ వేధించిన వారిదే బాధ్యత అని టీచర్ మునీర్ అన్నారు. వందేళ్ల మా తాతల నుంచి వచ్చిన భూమిని రాజకీయ నాయకుల ఒత్తిడితో రికార్డులు మార్చారని ఆరోపించారు.
- Tags
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!