Srinivas Reddy: రాష్ట్రంలో అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది: శ్రీనివాసరెడ్డి
- సీఎం చొరవతోనే రాష్ట్రానికి ఎన్నో సంస్థలు
- వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారు
- అంజాద్ బాషా పరిస్థితి ఏందో అందరికి తెలుసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పరిస్థితులను ప్రభుత్వం గాడిలో పెడుతోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు చొరవతోనే రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే.. వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే అని, నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.
‘రాష్ట్రంలో అన్ని పరిస్థితులను టీడీపీ ప్రభుత్వం గాడిలో పెడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు అత్యధిక ప్రధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి గూగుల్, యాపిల్ లాంటి ఎన్నో సంస్థలు వస్తున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్, విద్యార్థుల మీటింగ్ ఒక పండగ వాతావరణంలో జరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసింది వైసీపీ నాయకులే. నాడు నేడులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడారు. అంజాద్ బాషా పరిస్థితి ఏందో నగర ప్రజలకు అందరికి తెలుసు’ అని శ్రీనివాసరెడ్డి అన్నారు.
Also Read
- Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
- Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ విజయం వెనుక ఉన్న అసలు హీరో ఇతడేనా? ఐపీఎల్ అంతా నీడలా వెంట నడిచిన మెంటార్!
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
‘అంజాద్ బాషాను చూసి కాదు, నన్ను చూసి ఓట్లు వేయండి అని వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో చెప్పారు. కడపలో త్రాగునీటి సమస్య ఉందో లేదో మాతో వస్తావా? మేము నిరూపిస్తాం. అంజాద్ బాషా చేసిన అవినీతి అక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి కాంట్రాక్టులో 8% కమిషన్ తీసుకున్నారు. అంజాద్ బాషా ఇదే విధంగా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. మినిష్టర్ కాలనీ వల్ల ఏంతో మంది మోసపోయారు. అంజాద్ బాషా ఒక భేవకూఫ్. గతంలో నువ్వు మాట్లాడిన మాటలకు వేరే వాళ్లు ఉంటే అంజాద్ బాషాను అయన తమ్ముడు అహ్మద్ బాషను దున్నపోతు మీద ఊరేగింపు చేసేవారు. ప్రజా సమస్యలు మాట్లాడానికి మా ప్రభుత్వం గళం విప్పుతుంది. అవినీతి గురించి ఇంకొకసారి మాట్లాడితే మా నాయకులు ఊరికే ఉండరు’ అని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.
- Tags
- ap
- ap news
- Srinivas reddy
- tdp
- tdp govt
తాజావార్తలు
-
Vivek Agarwal’s Family: విధి ఆడిన వింత నాటకం.. తండ్రి కోసం వచ్చి ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి!
-
Ramchander Rao: కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది వాళ్లే.. బీజేపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..
-
Lagaan Re Release Date : 25 ఏళ్ల తర్వాత థియేటర్లలోకి ఆమిర్ ఖాన్ ‘లగాన్’… మచ్చటగా మూడు రోజులు మాత్రమే.!
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
ట్రెండింగ్
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!