Chintamaneni Prabhakar: అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chintamaneni Prabhakar: దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్లో చేసిన హల్చల్తో చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెదవేగి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమతో పాటు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తీసుకెళ్లారు. దీంతో చింతమనేనితో పాటు ఆయన అనుచరులు మొత్తం 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దీంతో పోలీసులకు పట్టుబడకుండా చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల 13న పోలింగ్ రోజున పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశారనే ఆరోపణలతో రాజశేఖర్ను పెదవేగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని.. తన అనుచరులతో కలిసి వెళ్లి పోలీసులతో గొడవపడ్డారు. నిందితుడిన తన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. సీఐ వారించినా ఏ మాత్రం తగ్గకుండా దురుసుగా ప్రవర్తించారు చింతమనేని ప్రభాకర్. ఈ కేసులో చింతమనేని కోసం హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలను పంపారు పోలీసు అధికారులు.
Read Also: SIT Investigation on Violence: వేగం పెంచిన సిట్.. నేడు కొలిక్కి వచ్చే అవకాశం!
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
పెదవేగి స్టేషన్ సిబ్బంది కస్టడీలో ఉన్న నిందితుడిని తీసుకువెళ్లిన ఘటనలో చింతమనేని త పాటు 18మందిపై కేసులు నమోదు అయ్యాయని నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య వెల్లడించారు. చింతమనేనితో పాటు నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు కొనసాగుతోందన్నారు. దెందులూరు సమస్య తన ప్రాంతం కాబట్టి కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరగకుండా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ.. గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. రౌడీ షీటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతించం.. ఏజెంట్లుగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. కౌంటింగ్ తర్వాత క్రాకర్స్ కాల్చకుండా, పెట్రోల్ బాటిల్స్ లో అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!