Chintamaneni Prabhakar: అజ్ఞాతంలోకి చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chintamaneni Prabhakar: దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల పెదవేగి పోలీస్ స్టేషన్లో చేసిన హల్చల్తో చింతమనేని ప్రభాకర్తో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పెదవేగి పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని తమతో పాటు చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు తీసుకెళ్లారు. దీంతో చింతమనేనితో పాటు ఆయన అనుచరులు మొత్తం 18 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. దీంతో పోలీసులకు పట్టుబడకుండా చింతమనేని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ నెల 13న పోలింగ్ రోజున పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశారనే ఆరోపణలతో రాజశేఖర్ను పెదవేగి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని.. తన అనుచరులతో కలిసి వెళ్లి పోలీసులతో గొడవపడ్డారు. నిందితుడిన తన వెంటబెట్టుకుని తీసుకెళ్లారు. అడ్డుకున్న పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. సీఐ వారించినా ఏ మాత్రం తగ్గకుండా దురుసుగా ప్రవర్తించారు చింతమనేని ప్రభాకర్. ఈ కేసులో చింతమనేని కోసం హైదరాబాద్, బెంగళూరుకు ప్రత్యేక బృందాలను పంపారు పోలీసు అధికారులు.
Read Also: SIT Investigation on Violence: వేగం పెంచిన సిట్.. నేడు కొలిక్కి వచ్చే అవకాశం!
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
పెదవేగి స్టేషన్ సిబ్బంది కస్టడీలో ఉన్న నిందితుడిని తీసుకువెళ్లిన ఘటనలో చింతమనేని త పాటు 18మందిపై కేసులు నమోదు అయ్యాయని నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య వెల్లడించారు. చింతమనేనితో పాటు నిందితుల కోసం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని.. నిందితులను అదుపులోకి తీసుకునేందుకు గాలింపు కొనసాగుతోందన్నారు. దెందులూరు సమస్య తన ప్రాంతం కాబట్టి కౌంటింగ్ రోజు అల్లర్లు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామన్నారు. కౌంటింగ్ తర్వాత అల్లర్లు జరగకుండా ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేస్తూ.. గ్రామసభలు నిర్వహిస్తున్నామన్నారు. రౌడీ షీటర్లు కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతించం.. ఏజెంట్లుగా ఉన్న వారి వివరాలు సేకరిస్తున్నామన్నారు. కౌంటింగ్ తర్వాత క్రాకర్స్ కాల్చకుండా, పెట్రోల్ బాటిల్స్ లో అమ్మకుండా చర్యలు తీసుకుంటున్నామని డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!