TCS CEO: టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ రాజీనామా.. సంస్థలో అనూహ్య మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TCS CEO: దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీస్ ప్రొవైడర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. టీసీఎస్ సీఈవో పదవికి రాజేశ్ గోపీనాథన్ రాజీనామా చేశారు. కంపెనీ ఆయన స్థానంలో కె.కృతివాసన్ను ఇన్చార్జి సీఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ఈ మేరకు టాటా గ్రూప్నకు చెందిన కంపెనీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదిలా ఉండగా.. ఆయన రాజీనామాకు గల కారణాలు బయటకు తెలియరాలేదు. పదవీకాలం ఇంకా నాలుగేళ్లు ఉండగానే రాజేశ్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే రాజేశ్ గోపీనాథన్ ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ టీసీఎస్లోనే కొనసాగుతారని, తదుపరి సీఈఓకు మార్గనిర్దేశనం చేస్తారని సంస్థ వెల్లడించింది. ఇక టీసీఎస్ సంస్థకు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెస్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్న కె.కృతివాసన్ టీసీఎస్ సీఈఓగా మార్చి 16న బాధ్యతలు చేపట్టారు. ఇన్ఫోసిస్ అధ్యక్షుడు మోహిత్ జోషి ఇటీవలే రాజీనామా చేసి టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్గా నియామకమైన నాలుగు రోజుల్లోనే టీసీఎస్ సీఈఓ అండ్ ఎండీ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Read Also: World Sleep Day: ఉద్యోగులకు కంపెనీ ‘సర్ప్రైజ్ గిఫ్ట్’.. ఈ రోజంతా హాయిగా నిద్రపోవాలంటూ..
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
గోపీనాథన్ టీసీఎస్లో దాదాపు 22 ఏళ్లపాటు సేవలందించారు. కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్గా, సీఈవో ఆరేళ్లు సేవలందించారు. అయితే, వచ్చే సెప్టెంబర్ వరకు ఆయన కంపెనీలో సేవలు అందించనున్నారు. ఆయన స్థానంలో కృతివాసన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆయన పూర్తి స్థాయి సీఈవోగా నియామకం కానున్నారు. కాగా.. టీసీఎస్ సంస్థ సీఈఓగా తనకు ఈ ఆరేళ్లు అద్భుతంగా గడిచిపోయాయని రాజేశ్ గోపీనాథన్ తెలిపారు. సంస్థలో తనది 22 ఏళ్ల పాటు సాగిన అద్భుతమైన ప్రయాణమని చెప్పుకొచ్చారు. తన నేతృత్వంలో సంస్థ ఆదాయం 10 బిలియన్ డాలర్ల మేర పెరిగిందని, మార్కెట్ విలువ 70 బిలియన్ డాలర్ల మేర వృద్ధి చెందిందని పేర్కొన్నారు. తదుపరి ఏం చేయాలనే విషయమై తనకు కొన్ని ఆలోచనలు ఉన్నాయన్నారు. రాజీనామా విషయమై సుదీర్ఘంగా ఆలోచించి. ఛైర్మన్తో పాటు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో చర్చించాకే తప్పుకోవాలని నిర్ణయించానన్నారు.
తాజావార్తలు
-
Shreyas Iyer IPL Record: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!
-
Best EV Cars India: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన వేళ.. అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. తక్కువ ధరకే ఎక్కువ దూరం
-
Tollywood : నిర్మాతలు vs ఎగ్జిబిటర్స్ వివాదంపై హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో కీలక సమావేశం
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!