TATA Group Stocks: టాటా గ్రూప్లోని ఈ 12 స్టాక్లు.. 6 నెలల్లో 150 శాతం లాభాలు తెచ్చిపెట్టాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TATA Group Stocks: టాటా గ్రూపునకు చెందిన 28 కంపెనీలు స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. వాటిలో 24 కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల రాబడిని ఇచ్చాయి. ఈ స్టాక్స్ ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించాయి. అయితే, టాటా గ్రూప్లోని కొన్ని స్టాక్స్ కూడా క్షీణించాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో లేదా ఆరు నెలల్లో 154 శాతం రాబడిని అందించిన టాటా గ్రూప్కు చెందిన 12 స్టాక్ల గురించి తెలుసుకుందాం. టాటా గ్రూప్కు చెందిన ఆర్ట్సన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ షేర్ల ప్రస్తుత ధర రూ.167.80, ఇది ఏప్రిల్ నుంచి 154 శాతం రాబడిని అందించగా ఆరు నెలల్లో 138 శాతం రాబడిని ఇచ్చింది. దీని షేర్లు శుక్రవారం దాదాపు 2 శాతం పడిపోయాయి. టాటా గ్రూప్తో అనుబంధం ఉన్న గోవా ఆటోమొబైల్ కంపెనీ శుక్రవారం 1.40 శాతం పెరుగుదలతో ఒక్కో షేరు రూ.1,494.95 వద్ద ట్రేడవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 105 శాతం రాబడిని ఇచ్చింది. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ప్రస్తుత షేరు ధర రూ. 3,285 కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 97 శాతం రాబడిని ఇచ్చింది.
Read Also:Lal Bahadur Shastri: నిజాయితీకి, సరళతకు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి
Also Read
- Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
- Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
- Dr Priyanka Murder Case: డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ ఆఫీసర్!
- PM Modi: ‘దేశం.. ప్రజాస్వామ్యం శాశ్వతంగా వర్ధిల్లాలి’.. వాజ్పేయీ సందేశాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని..
అదేవిధంగా, బనారస్ హోటల్స్ లిమిటెడ్ షేర్ల ధర రూ. 5,850. ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో 79 శాతం పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో టాటా టెలిసర్వీసెస్ 77 శాతం జంప్ చేసి ప్రస్తుతం రూ.99.45 వద్ద ట్రేడవుతోంది. Tayo Rolls ఒక షేరు ధర ప్రస్తుతం రూ. 91.50. ఈ ఆర్థిక సంవత్సరంలో 76 శాతం పెరిగింది. టాటా గ్రూప్ కంపెనీలలో టాటా కమ్యూనికేషన్ షేర్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 52 శాతం పెరిగాయి. శుక్రవారం ఒక్కో షేరుకు రూ.1,925.20 వద్ద ట్రేడవుతోంది. నెల్కో ఏప్రిల్ నుంచి 50 శాతం పెరిగి రూ.780.20 వద్ద ట్రేడవుతోంది. ట్రెంట్ ఒక్కో షేరుకు రూ. 2,082.65 వద్ద ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో 50 శాతం పెరిగింది. తేజస్ నెట్వర్క్ ఒక్కో షేరు 48 శాతం పెరిగి రూ.874.80 వద్ద ట్రేడవుతోంది. టీఆర్ఎఫ్ 47 శాతం పెరిగి రూ.238.50 వద్ద ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్ 46 శాతం వృద్ధి చెంది ఒక్కో షేరు రూ.631కి చేరుకుంది.
Read Also:Dalit Bandhu Scheme: నేడే దళిత బంధు రెండో విడత.. ప్రారంభించనున్న కేటీఆర్
తాజావార్తలు
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
-
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
-
Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
-
Varanasi Airport Gunfire: ఎయిర్పోర్టులో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలు
-
Car Accident: పెళ్లి సందడి టు విషాదం.. కాలువలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువకులు గల్లంతు!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!