Tarun Chugh : కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని అందరికీ తెలిసిందే అని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్. ఒకటే పనికి రెండు మార్గాల్లో నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ సర్కార్ మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు. తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేస్తూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ ఒకే పనిని వేరువేరు పథకాల కింద చూపి, వాటికి రెండు సార్లు నిధులు రాబట్టి, స్వాహా చేయడం షాక్ కు గురి చేస్తుందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ అన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మోసానికి పాల్పడడం దేశంలో ఇదే మొదటిసారని, బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వమని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
Also Read : Uttar Pradesh: ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!
Also Read
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
- Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి కేవలం భారీ నీటిపారుదల ప్రాజెక్టులకే పరిమితం కాలేదంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన 6 రోడ్డు ప్రాజెక్టులలోనూ పెద్దఎత్తున అవినీతి జరిగిందన్నారు. ఒకే పనిని రెండు పథకాల కింద చూపడంతో, రెండు సార్లు విడుదలైన నిధులను స్వాహా చేసిందన్నారు. ఈ రోడ్డు ప్రాజెక్టులను రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం కింద ఒకసారి, కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద రెండోసారి చూపి కేసీఆర్ సర్కార్ కేంద్ర ప్రభుత్వ సంస్థలను బురిడీ కొట్టించిందని వ్యాఖ్యానించారు. అంటే ఒకే పనికి రెండు వేర్వేరు మార్గాల ద్వారా నిధులు రావడంతో, రెట్టింపునిధులు విడుదలయ్యాయని అన్నారు.
Also Read : World Cup: ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ పథకం కింద విడుదలైన రూ.4,144 కోట్లు పక్కదారి పట్టినట్లు స్పష్టమవుతుందన్నారు. ఈ పథకం కింద అమలు చేసినట్టు చూపించిన పనులు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రుణం ద్వారా అమలు చేసిన పనులే ఉన్నాయి. ఇది పెద్ద కుట్ర, మోసం, దీనిపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయం కింద గత తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ రహదారుల పనులు, తెలంగాణ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పొందిన రుణాలు సహా అన్ని ప్రాజెక్టులపై సీబీఐ విచారణ జరిపించాలని తరుణ్ చుగ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Hanuman : మళ్లీ ‘హనుమాన్’ జాతర.. ఈసారి 3Dలో థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!
-
Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
-
Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
-
Naresh : నరేష్ గ్యారేజ్లోకి కొత్త బీస్ట్: రూ. 2.7 కోట్ల పోర్షే కారు కొన్న తొలి టాలీవుడ్ నటుడు!
-
Rishabh Pant Fined: విజయం సాధించినా.. LSG కెప్టెన్ కు తప్పని భారీ ఫైన్..!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..