Uttar Pradesh: ప్రభుత్వ ఆఫర్.. అక్కడ సగం రేటుకే టమోటాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జనాలు ఇప్పుడు సగం ధరకే టమోటాలు పొందనున్నారు. వారికి మొబైల్ వ్యాన్ల ద్వారా ఈ సదుపాయం అందించింది అక్కడి ప్రభుత్వం. లక్నో మేయర్ సుష్మా ఖార్క్వాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం ప్రారంభమైంది. భారత ప్రభుత్వ సహకారంతో నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సిసిఎఫ్ఐ) ద్వారా.. లక్నోలోని 11 చోట్ల టమాటోలను మొబైల్ వ్యాన్లలో కిలో రూ.80కి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. అయితే ఒక వ్యక్తి రోజుకు 2 కిలోల టమోటాలు మాత్రమే కొనుగోలు చేయాలి.
World Cup: ప్రపంచ కప్కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్.. వాళ్లు వచ్చేస్తున్నారు..!
Also Read
- Supreme Court: ప్రేమికుల్ని నిలువరించడం సాధ్యమా? పోక్సో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు చీవాట్లు
- India-US: అమెరికాతో ఒప్పందం వద్దనుకుంటున్నట్లు కథనాలు.. పీయూష్ గోయల్ క్లారిటీ
- Bengaluru: ప్రేమికుడిని పెళ్లాడిన 4 నెలలకే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏం రాసిందంటే..!
- Tamil Nadu: గోవధ నిషేధంపై విజయ్ సర్కార్కు సుప్రీంకోర్టులో ఊరట
లక్నోలోని మడియాన్వ్ ప్రాంతంలో మొబైల్ వ్యాన్ల ద్వారా NCCF ప్రజలకు టమోటాలు అందిస్తోంది. మార్కెట్లలో టమాట ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మొబైల్ వ్యాన్ లలో టమాటా కొనుగోలు చేసే వారు బారులు తీరారు. మరోవైపు ఇలాంటి కార్యక్రమం చేపట్టడంపై.. భారత ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సామాన్యులకు కొంత ఊరట లభించనుంది. మార్కెట్లలో వ్యాపారులు కిలో టమాటా రూ.120 నుంచి 130 వరకు అమ్ముతున్నారు. మరికొన్ని చోట్ల మార్కెట్లలో టమాటా 160 నుంచి 200 వరకు విక్రయిస్తున్నారు.
Harassment: 18 మంది బాలికలపై వేధింపులు.. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
పెరుగుతున్న టమాటా ధరలపై కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే మాట్లాడుతూ.. 22 నిత్యావసర వస్తువుల జాబితాలో టమోటాలు, ఉల్లిపాయలు కూడా ఉన్నాయని తెలిపారు. టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం నాఫెడ్ ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాటిని విక్రయించడం ప్రారంభించిందని తెలిపారు. అంతేకాకుండా బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బీహార్ ప్రభుత్వాన్ని కూడా బ్లాక్ మార్కెటింగ్ ఆపాలని కోరినట్లు పేర్కొన్నారు. కానీ బీహార్ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా బ్లాక్ మార్కెట్ దందా కొనసాగిస్తుందంటూ విమర్శించారు.
తాజావార్తలు
-
RBI Report: తీవ్ర ద్రవ్యోల్బణంలో తెలంగాణ.. ఆర్బీఐ నివేదిక
-
Jani Master: చిరంజీవి సమక్షంలో కలిసిన జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్.. పెద్దరికం అంటే ఇదే!
-
Suryakumar Yadav: టీ20 జట్టులోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బీసీసీఐ కీలక సంకేతాలు
-
UK-Iran: ఐఆర్జీసీపై బ్రిటన్ సంచలన నిర్ణయం.. ఉగ్ర సంస్థగా ప్రకటన
-
Harish Rao : రేవంత్ కేవలం ఉద్యమ ద్రోహే కాదు.. జలద్రోహి కూడా..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!