Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని ప్రముఖ తిరుచెందూరు మురుగన్ ఆలయంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సామాన్య భక్తుల నుంచి వీఐపీ దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై రాష్ట్ర మంత్రి రమేష్ స్వయంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనంగా మారింది.
సాధారణ భక్తుడిలా మాస్క్ ధరించి ఆలయానికి వెళ్లిన మంత్రి రమేష్.. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఓ అర్చకుడు వీఐపీ దర్శనం కల్పిస్తానంటూ మంత్రి నుంచి రూ.4 వేలు డిమాండ్ చేశాడు. ఇందుకు గాను మంత్రి కూడా అనుమానం రాకుండా గూగుల్ పే ద్వారా అర్చకుడికి రూ.4 వేలును చెల్లించారు. ఆ చెల్లింపుకు దర్శనం పూర్తయిన తర్వాత మాస్క్ తొలగించి తన అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
Also Read
- Ind vs SL: 'జడేజా' రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
- AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
- Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
- Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు.. 'ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు' నినాదంతో వేడుకలు!
మంత్రి స్వయంగా ఇదంతా చేశాడని తెలిసిన వెంటనే సంబంధిత అర్చకుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు.. అర్చకుడితో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు మంత్రి స్వయంగా రంగంలోకి దిగడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. మరికొందరు కొత్తగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వంతో రాష్ట్రంలో మార్పు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు.
తాజావార్తలు
-
Rule Changes from August 1: ఆగస్టు 1 నుంచి రానున్న కొత్త రూల్స్ ఇవే.. LPG ధరల నుంచి తత్కాల్ రైలు టికెట్ల వరకు
-
Dhanush: ధనుష్ బర్త్డే రోజే ‘ఓం’ రిలీజ్ డేట్ ట్విస్ట్.. ‘జైలర్ 2’తో క్లాష్ తప్పించుకుంటుందా?
-
Ind vs SL: ‘జడేజా’ రీఎంట్రీ.. శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ప్రకటన.!
-
AP Weather Update: తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షాలు!
-
Karimnagar: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో అక్రమాలు.. ఇద్దరు కానిస్టేబుళ్లు, ఆర్ఎస్ఐ సస్పెన్షన్.!
ట్రెండింగ్
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!